జనసేన పార్టీ సభ్యత్వ నమోదు కోసం ఓ మిస్డ్ కాల్ ఇస్తే చాలునని గుంటూరులోని మంగళగిరి సభలో జనసేనాని పవర్ స్టార్ పవన్ కల్యాన్ ప్రకటించి సరిగ్గా నేటికి 19 రోజులు.కానీ సభ్యత్వాలు సంఖ్య మాత్రం ఏకంగా 17 లక్షలు. రమారమి రోజుకు లక్ష మంది చొప్పున జనసేన సభ్యత్వాలు నమోదువుతున్నాయంటే.. పార్టీ అధినేతపై అభిమానంతో పాటు పార్టీని విశ్వసిస్తున్న వారి సంఖ్యకూడా ఇక్కడ ప్రతిభింబిస్తుంది. ఇదే జోష్ లో అభిమానులకు మరింతగా చేరువయ్యేందుకు జనసేన సరికొత్త యాప్ ను కూడా తీసుకురానుంది.
జనసేన ఆవిర్భావ మహాసభలో అధినేత పవన్ పిలుపు మేరకు మిస్డ్ కాల్ తో ఇప్పటికి 17 లక్షల మందికి పైగా సభ్యులుగా చేరారని ఆ పార్టీ ఓ ప్రకటనలో తెలిపింది. దీంతో మిస్డ్ కాల్ తో పాటుగా మరో విధంగా కూడా సభ్యత్వాలను నమోదు చేయడం కోసం ప్రత్యేకంగా జనసైన్యం పేరుతో ప్రత్యేక యాప్ ను కూడా ఏప్రిల్ 2 నుంచి సభ్యులకు అందుబాటులోకి తీసుకురాన్నామని జనసేన ఐటీ విభాగం వెల్లడించింది. దీంతో జనసేన కార్యక్రమాలన్ని ఎప్పటికప్పుడు పార్టీ సభ్యులతో పంచుకునే అవకాశం వుంటుందని తెలిపారు.
నిజాయతీగల రాజకీయాలతో పటిష్ఠమైన పౌర సమాజం నిర్మించేందుకు జనసేన కట్టుబడి ఉందని జనసేన ప్రతినిధి విజయ నిర్మల అన్నారు. పార్టీ సభ్యులుగా కేవలం పార్టీ అధినేత దర్శనీకతలో నడుస్తామని విశ్వాసమున్న సభ్యులందరినీ చేర్చుకుంటామని అమె తెలిపారు. మరీ ముఖ్యంగా ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకున్నవారిలో యువతే అధికంగా వున్నారని తెలిపారు. సుమారుగా 40 శాతం మంది పార్టీకి వాలంటీర్లుగా సేవ చేసేందుకు సుముఖత వ్యక్తం చేశారు. యాప్ ద్వారా సభ్యత్వ నమోదు ప్రక్రియ మరింత సులభం అవుతుంది. జనసైన్యం పేరుతో సభ్యత్వ నమోదు కార్యక్రమం ఉంటుంది' అని చెప్పారు.
ఐటీ విభాగం తరఫున శ్రీనివాస్ మిరియాల మాట్లాడుతూ.. '93940 22222 నంబర్కు మిస్డ్ కాల్ ఇస్తే చాలు సభ్యులు కావచ్చు. వారి ఫోన్ కి యూనిక్ మెంబర్ షిప్ ఐడీ వస్తుంది. మెంబర్ షిప్ వెబ్ సైట్ లోకి లాగిన్ కావడానికి ఒక లింక్ కూడా పంపిస్తాం. తమ ఫోటో, ఎంపిక చేసుకున్న భాషలో ఈ-మెంబర్ షిప్ కార్డు కూడా తీసుకోవచ్చు. ఈ ప్రక్రియ ఒక నిమిషం కంటే తక్కువ వ్యవధిలో పూర్తవుతుంది. పార్టీ కోసం వారు ఎక్కడ, ఎలాంటి పని చేయదలచుకున్నారో కూడా తెలియజేసే వెసులుబాటు అందులో ఉంటుంది. పార్టీ వాలంటీర్లు తమ చుట్టుపక్కల వారిని సభ్యులుగా నమోదు చేసే యాప్ ద్వారా ఏప్రిల్ 2 వ తేదీ నుంచి సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపడుతున్నామని అన్నారు.
(And get your daily news straight to your inbox)
Jan 21 | తెలంగాణ అధికార పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు కే కేశవరావు తనయ.. షేక్ పేట్ తహసీల్దార్ శ్రీనివాస్ రెడ్డీలు పరస్పరం బంజారాహీల్స్ పోలిస్ స్టేషన్లో పిర్యాదు చేసుకున్నారు. అదేంటి కేకే తనయ విజయలక్ష్మి... Read more
Jan 21 | ఆంధ్రప్రదేశ్ లో గ్రామపంచాయితీ ఎన్నికల నిర్వహణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్రోన్నత న్యాయస్థానం హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. రాష్ట్ర ప్రభుత్వం వాదనలతో ఏకీభవించని న్యాయస్థాన ధర్మాసనం రాష్ట్ర ఎన్నికల సంఘం వాదనలను బలపరుస్తూ రాష్ట్రంలో... Read more
Jan 21 | టీడీపీ సీనియర్ నేత, మాజీమంత్రి కళా వెంకట్రావును అరెస్టు చేయలేదని, కేవలం విచారణకు మాత్రమే పిలిచామని విజయనగరం జిల్లా ఎస్పీ బి రాజకుమారీ తెలిపారు. రామతీర్థాన్ని టీడీపీ నేతలు సందర్శించిన రోజున జరిగిన ఘటనపై... Read more
Jan 21 | అగ్రరాజ్యం అమెరికా 46వ అధ్యక్షుడిగా డెమొక్రాట్ పార్టీ అభ్యర్థి జోబైడెన్ ప్రమాణ స్వీకారం చేశారు. రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా రెండో పర్యాయం బరిలో నిలిచిన డోనాల్డ్ ట్రంప్ ను గణనీయమైన ఓట్లతో ఓడించి.. ఆయన... Read more
Jan 21 | దేశ రాజధానిలో తన సత్తాను చాటిన అమ్ ఆద్మీ పార్టీ రెండో పర్యాయం కూడా అధికారంలోకి రాకముందే అటు పంజాబ్, ఇటు హర్యానా సహా పలు రాష్ట్రాల్లోనూ సత్తా చాటుకునేందుకు ప్రయత్నాలు కొనసాగించింది. పంజాబ్... Read more