విజయవాడ వాసులకు గుడ్ న్యూస్.. అందులోనూ విజయవాడ పరిసర ప్రాంతాలకు చెందిన షిర్డీ సాయి భక్తులకు మరింత తీపికబరు. అయితే కాకనాడ ఎక్స్ ప్రెస్ రైలులో నితరంతర రద్దీగా వుండి మూడు నెలల నుంచే బుకింగ్ ప్రారంభైమైనా కొద్ది రోజుల వ్యవధిలోనే వెయింటింగ్ లిస్ట్ జాబితాలోకి వెళ్లే సాయినగర్ షిర్టీ ఎక్స్ ప్రైస్ రైలులో షిర్డీని దర్శించుకోవడం లేదా సికింద్రాబాద్ వరకు ఎలాగోలా వచ్చి అక్కడి నుంచి మన్మాడ్ కు వెళ్లే రైలులో షిర్డీ చేరుకునే వారు భక్తులు. వీరి కష్టాన్ని సాయినాధుడు ఇకపై కొంతమేర దూరం చేస్తున్నాడు.
అదెలా అంటారా.. విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఏకంగా షిర్డీకి ప్రత్యేక విమానాలను నడిపించనున్నారు. ఔనండీ.. అన్ని అశించినట్లు సవ్యంగా జరిగితే మరో రెండు మాసాల్లో విజయవాడ నుంచి షిర్డీకి ఏకంగా విమానాయానం చేసుకోవచ్చు. విజయవాడ నుంచి షిర్డీకి విమాన సర్వీసును నిర్వహించేందుకు సుప్రీం ఎయిర్లైన్స్ ముందుకువచ్చింది. చార్టర్డ్ విమానాలతో సేవలందిస్తున్న ఈ సంస్థ ఇప్పటికే ఎయిర్ పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఎఐ) నుంచి అనుమతులు కూడా అందుకుంది.
విజయవాడ విమానాశ్రయంలో బుకింగ్, చెకిన్ కౌంటర్లతో పాటు, పార్కింగ్ సదుపాయాన్ని కల్పించాలని కోరుతూ విజయవాడ విమానాశ్రయ అధికారులకు లేఖ రాసింది. ఇదిలావుండగానే విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి మరిన్ని విమాన సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి. వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకుని పలు విమానయాన సంస్థలు తమ సర్వీసులను విస్తరించేందుకు రెడీ అవుతున్నాయి. ఈ మధ్యనే విజయవాడ నుంచి సర్వీసులు ప్రారంభించిన ఇండిగో ఎయిర్లైన్స్.. చెన్నై, బెంగళూరు నగరాలకు సర్వీసులు విస్తరించనున్నట్లు ప్రకటించింది.
ఈ రెండు సర్వీసులు ఏప్రిల్ 4 నుంచి అందుబాటులోకి రానున్నాయని తెలిపింది. ఇక ఇండిగో ఇప్పటికే విజయవాడ నుంచి హైదరాబాద్కు మూడు, చెన్నై, బెంగళూరు నగరాలకు ఒక్కో విమానాన్ని నడుపుతోంది. అలాగే ఏప్రిల్ 25 నుంచి విశాఖపట్నానికి సర్వీసును ప్రారంభించాలని నిర్ణయించింది. మరోవైపు స్పైస్ జెట్ కూడా వేసవికి మరిన్ని సర్వీసులను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇక సుప్రీం ఎయిర్ లైన్ సంస్థ మే నెలలో షిర్డీకి విమాన సర్వీసును అందుబాటులోకి తీసుకురావాలని ఏర్పాట్లు చేసుకుంటుంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more