Parliament logjam adjourns both Houses, no-trust vote not taken up అవిశ్వాసంపై చర్చలేకుండానే ఉభయసభలు వాయిదా

Parliament logjam adjourns both houses no trust vote not taken up

TDP, YSRCP, no confidence motion, council of minister, prime minister, PM Modi, Union Govenment, Andhra pradesh, special status, congress, trinamul congress, left parties, national congress party, biju janatadal, andhra pradesh special status, TRS, AiADMK, BJP, chandrababu, vishnu kumar raju, JanaSena, corruption, andhra pradesh, politics

The Lok Sabha proceedings were disrupted for the 11th day on Monday as the Telugu Desam Party (TDP), YSR Congress, Telangana Rashtra Samithi (TRS) and All India Anna Dravida Munnetra Kazhagam (AIADMK) continued their noisy protests over various issues, including the banking scam and special status for Andhra Pradesh.

అవిశ్వాసంపై చర్చలేకుండానే ఉభయసభలు వాయిదా

Posted: 03/19/2018 12:15 PM IST
Parliament logjam adjourns both houses no trust vote not taken up

అంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించే అంశంలో కేంద్రప్రభుత్వంపై పెట్టిన అవిశ్వాస తీర్మాణం నేపథ్యంలో ముందునుంచి నెలకొన్న ఉత్కంఠ.. చివరాఖరున ఉభయసభల వాయిదాతో అంతా కేంద్రప్రభుత్వం స్కెచ్ ప్రకారమే నడుస్తుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. పార్లమెంటు ఉభయసభలు ప్రారంభమైన తరువాత వాయిదా పర్వం కొనసాగింది. నవ్యాంధ్ర ఎంపీలందరూ తమ అవిశ్వాస తీర్మాణం చర్చకు వస్తుందని అశించినా.. దానిపై ఎలాంటి చర్చలేకుంానే సభ వాయిదా పడింది.

ఈ తరుణంలో.. అన్నాడిఎంకే, టీఆర్ఎస్ పార్టీలకు చెందిన ఎంపీలు తమ డిమాండ్లను వెంటనే పరిష్కారించాలని వివిధ డిమాండ్లను పార్లమెంటు ముందుకు తీసుకువచ్చి అవిశ్వాస తీర్మాణాన్ని చర్చకు రానీయకుండా చేశారు. అయితే ఇటీవలికాలంలో అటు టీడీపి ఎంపీలు సభలో నిరసన వ్యక్తం చేస్తునా.. వారి నిరసల మధ్యే సభను కొనసాగించిన ఘటనలను చూసిన దేశ ప్రజలకు ఇవాళ్టి సభలో అదే తీరులో అవిశ్వాసం తీర్మాణంపై చర్చ జరుగుతుందని పెట్టుకున్న అశలు అడియాశలయ్యాయి.

లోక్ సభలో..
ఉదయం 11 గంటలకు మొదలైన లోక్ సభలో అవిశ్వాస తీర్మాణంపై చర్చకు ప్రభుత్వం సిద్దంగా వుందని, అయితే సభలో అందోళన చేస్తున్న సభ్యులు తమ స్థానాల్లో కూర్చోవాలని స్పీకర్ సుమిత్రామహాజన్ కోరారు. అయినా సభలో అందోళన  చేస్తున్న టీఆర్ఎస్, అన్నాడీఎంకే సభ్యులు అందోళన నేపథ్యంలో క్షణాల్లోనే సభను స్పీకర్ 12 గంటల వరకూ వాయిదా వేశారు.

తిరిగి 12 గంటలకు సభ తిరిగి ప్రారంభంకాగానే.. సభపై అవిశ్వాస తీర్మాణాన్ని చదవి వినించారు స్పీకర్ సుమిత్రా మహాజన్. సభ్యులు శాంతియుతంగా కూర్చోవాలని స్పీకర్ విన్నవించినా. టీఆర్ఎస్, అన్నాడీఎంకే సభ్యులు నిరసనలు అగలేదు. మైనారిటీలకు రిజర్వేషన్లను కల్పించాలని టీఆర్ఎస్, కావేరి బోర్డును ఏర్పాటు చేయాలని అన్నాడీఎంకే సభ్యులు నిరసన తెలిపారు. ఈ క్రమంలో సభలో గంధరగోళం ఏర్పడటంతో సభను స్పీకర్ మంగళవారానికి వాయిదా వేశారు.

రాజ్యసభలో..

ఇక అటు రాజ్యసభలో కూడా ఇవే పరిస్థితులు ఉత్పన్నమయ్యాయి. సభ ప్రారంభం కాగానే చైర్మెన్ వెంకయ్యనాయుడు సభ్యులను శాంతియుంతంగా వుండాలని విన్నవించారు. అయితే సభ్యులు శాంతించలేదు. దీంతో ప్రభుత్వం అన్ని అంశాలపై మరీ ముఖ్యంగా అవిశ్వాస తీర్మాణంపై చర్చించేందుకు కూడా సిద్దంగా వుందని పదే పదే చెప్పినా.. టీఆర్ఎస్, అన్నాడీఎంకే సభ్యులు మాత్రం శాంతించలేదు. అయితే రోటిన్ భిన్నంగా ఇవాళ అవిశ్వాసంపై చర్చ నేపథ్యంలో నవ్యాంధ్ర ఎంపీలు మాత్రం తమతమ స్థానాలలో అసీనులయ్యారు. దీంతో సభలో గంధరగోళం దృష్ట్యా.. రాజ్యసభ కూడా స్పీకర్ వెంకయ్యనాయుడు మంగళవారానికి వాయిదా వేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : TDP  YSRCP  no confidence motion  no turst vote  TRS  AiADMK  BJP  PM Modi  Union Govenment  Andhra pradesh  special status  

Other Articles