తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటే విధంగా జరుపుకున్నారు. అయితే ఇంకా పలు ప్రాంతాల్లోని యువత మాత్రం ఈ సంబరాల జోష్ నుంచి పక్కకు తప్పుకోలేకపోతుంది. దీంతో యువతను అట్రాక్ట్ చేసేందుకు కొందరు నిర్వాహకులు రికార్డింగ్ డ్యాన్స్ లు ఏర్పాటు చేస్తున్నారు. కాగా, ఈ రికార్డు డాన్సుల మాటున యువతను పెడతోవ పట్టించేలా యువతులు అర్థనగ్న నృత్యాలు చేస్తూ హద్దులు మీరిపోతున్నారు. కొంత మంది మహిళా డ్యాన్సర్లతో విచ్చలవిడిగా రెచ్చగొట్టి వారిపై రాలే కాసుల కోసం కుహానా సంబరాలు జరుపుతున్నారు.
ఈ క్రమంలో పక్క సమాచారం అందుకుని దాడులు నిర్వహించిన పోలీసులకు కొన్ని చోట్ల అశ్లీల నృత్యాలు చేస్తూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడుట్టారు. అయితే పలు చోట్ల మాత్రం పోలీసుల సమాచారం అందుకున్న నిర్వాహకులు మహిళా డాన్సర్లను అప్రమత్తం చేయడంతో హుటాహుటిన అర్థనగ్న నృత్యాలకు అడ్డాగా మారిన వేదిక కాస్తా క్షణాల్లో రికార్డింగ్ డాన్సుల వేదికగా మారిపోతున్నాయి. ఈ క్రమంలో తాజాగా తూర్పుగోదావరి జిల్లాలో ఆశ్లీల నృత్యాలు చేశారంటూ కొందరు మహిళా డ్యాన్సర్లను పోలీసులు అరెస్టు చేయడం విమర్శలకు దారితీసింది.
పెద్దాపురం మండలం గోరింట గ్రామంలో అమ్మవారి జాతర సందర్భంగా మహిళలతో రికార్డింగ్ డ్యాన్సులు నిర్వహించారు. అయితే ఈ జాతరలో నిర్వాహకులతో ఒప్పందం మేరకు డ్యాన్సర్లు అశ్లీల నృత్యాలు చేసినట్లు తెలిసింది. సమాచారమందుకున్న పోలీసులు ఆ మహిళలను అరెస్టు చేయడమేగాక నిర్వాహకులను కూడా అరెస్టు చేశారు. కాకపోతే పోలీసులు వ్యవహరించిన తీరుపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. పోలీసులు వచ్చే సమయానికి అర్థనగ్నంగా ఉన్న మహిళా డ్యాన్సర్లు దుస్తులు మార్చుకునే సమయం కూడా ఇవ్వకుండా ఉన్నపళానే అలాగే అర్థనగ్నంగా వారిని అరెస్ట్ చేసి తీసుకెళ్లారని, అలా చెయ్యడం సమంజసం కాదని స్థానిక మానవ హక్కుల సంఘం నేతలు అభిప్రాయం వ్యక్తం చేశారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more