డబ్బు ఎవరికి చేదు అన్న చందంగా కట్టల కట్టల డబ్బు కనిపిస్తే.. ఎవరు మాత్రం చూడకుండా వుంటారు. ఎలాగో అంత డబ్బును అర్జించే అవకాశం లేదు. అవకాశమున్నా అంత డబ్బును అలా ఎప్పుడూ చూడలేము. ఇక దీంతో అలా కట్టల కట్టల డబ్బు కనిపించేసరికి అ వీడియోనూ చూస్తూ నెట్ జనులు మురిసిపోవడంతో.. ఆ వీడియో కాస్త నెట్టింట్లో హల్ చల్ చేస్తుంది.
ఈ వీడియోలో అప్పుడే ప్రింటింగ్ పూర్తి చేసుకొని కట్టలు కట్టలుగా పేర్చిన కొత్త నోట్లను గుట్టలు గుట్టలుగా ఓ వ్యక్తి పేరుస్తూ కనిపిస్తున్నాడు. అయితే ఇవి ఒరిజినల్ నోట్లేనా.. లేక దొంగనోట్లా..? అన్న సందేహాలు తాజాగా వ్యక్తమవుతున్నాయి. ఎన్ఎన్ పిపిలో మాత్రమే ప్రింట్ చేసే నోట్లను అత్యంత కట్టుదిట్టమైన భద్రత నడుమ ప్రింట్ చేస్తారు. ఇక్కడ వీడియో తీసే అవకాశమే ఉండదని, అయితే ఓ వ్యక్తి ఏకంగా కొత్త నోట్లను పేరుస్తూ వీడియోకు ఫోజునివ్వడం అనుమానాలకు తావిస్తుంది.
పాత పెద్ద నోట్ల రద్దు తరువాత కేంద్రం అనుమతితో రిజర్వబ్యాంకు అప్ ఇండియా అమోదంతో కొత్తగా చెలమాణిలోకి వచ్చిన రూ. 50, 200, 500, 2000 నోట్లను ప్రభుత్వం తీసుకువచ్చిన విషయం తెలిసిందే. అయితే వీడియోలో కనిపిస్తున్న ఈ నోట్లు అచ్చిందా కొత్తగా తీసుకువచ్చిన రూ.50, రూ.200 ల మాదిరిగా వుండటంతో అది కాస్తా వైరల్ గా మారుతుంది. ఇక ఇప్పటికీ తగిన సంఖ్యలో రూ.50, రూ.200 నోట్లు అందుబాటులోకి రాకపోవడంతో..అవే నోట్లను వీడియోలోని వ్యక్తం పేరుస్తుడంటం కూడా అనుమానాలకు తావిస్తుంది.
కొద్దిగా తీక్షణంగా పరిశీలిస్తే ఈ నోట్లు ఒరిజినల్ కావని చెప్పవచ్చు. అదెలా అంటే.. సాధారణంగా నోట్ల పై భారతీయ రిజర్వ్ బ్యాంక్ అని రాసి ఉంటుంది. అయితే వీడియోలో చూపించిన నోట్లలో మాత్రం భారతీయ చిల్డ్రన్ బ్యాంక్ అని రాసి ఉంది. అంటే వీడియోలో చూపించింది చిన్న పిల్లలు ఆడుకోవడానికి తయారు చేసే నోట్ల ఫ్యాక్టరీ అని కొందరు నెటిజన్లు కామెంట్లు పెడుతుంటే, మరికొందరు చిన్న పిల్లలు ఆడుకోవడానికైతే మరీ అంత పెద్ద ఫ్యాక్టరీలో ప్రింట్ చేస్తారా, కాదు కాదు.. అవి దొంగనోట్లు తయారు చేసే ఫ్యాక్టరీనే అంటూ వాదిస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more