దేశరాజధాని ఢిల్లీలో భారీ బ్యాంకు దోఫిడి పోలీసులకు పనితీరుకు, స్థానికులు అప్రమత్తతను ప్రశ్నిస్తోంది. ఢిల్లీలోని శివారు ప్రాంతంలో గల ఓ బ్యాంకుకు కన్నం వేసిన దోంగలు ఏకంగా పది గంటల పాటు బ్యాంకులో తమ కార్యకలాపాలన్నీంటినీ ముగించుకుని కేటుగాళ్లు పారిపోయారు. ఈ ఘటన పోలీసులకు సవాలు విసురుతోంది. ఇప్పటికే ఓ వైపు దేశరాజధాని నేరాలకు రాజధానిగా మారిందన్న విమర్శలను ఎదుర్కొంటున్న క్రమంలో ఈ దోపిడీలు వారికి నిద్రకు దూరం చస్తున్నాయి.
బ్యాంకు లాకర్లను గ్యాస్ కట్టర్లతో కోసి మరీ దోపిడి చేశారు. లాకర్లలోని రూ. కోటికిపైగా విలువ చేసే నగదు, బంగారు ఆభరణాలను ఎత్తుకెళ్లడం సంచలనం సృష్టిస్తోంది. ఔటర్ ఢిల్లీలోని ముంద్కాలో చోటుచేసుకున్న ఈ ఘటనలో దొంగలు మొత్తం 15 లాకర్లు బద్దలుగొట్టడంతో పాటు సీసీ కెమెరాలను కూడా దగ్ధం చేశారు. బ్యాంకు దోపిడికి వారు ఏకంగా ఎనమిది గ్యాస్ సిలిండర్లను వాడినినట్టు పోలీసులు తెలిపారు. బ్యాంకు పక్కనే ఉన్న ప్లాటు లోనికి కన్నం వేసిన దోంగలు గ్యాస్ కట్టర్లు, 8 గ్యాస్ సిలిండర్లు ఉపయోగించి బ్యాంకు లాకర్లను తెరిచారు.
శనివారం, లేదంటే ఆదివారం రాత్రి బ్యాంకు సెలవు దినాలను పరిగణలోకి తీసుకున్న దొంగలు ఈ తరహా చోరికి పాల్పడివుంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సొత్తుతో ఉడాయించిన దొంగలు గ్యాస్ సిలిండర్లు, రంధ్రం చేసేందుకు ఉపయోగించిన వస్తువులను అక్కడే వదిలేసి వెళ్లిపోయారు. వాటిని స్వాధీనం చేసుకున్న పోలీసులు అవి కొత్తగా ఉన్నాయని, దోపిడీ కోసమే వాటిని కొనుగోలు చేసినట్టు చెప్పారు. వాటిని కూడా పరిశీలించిన పొలీసులు వాటిపై వేలిముద్రలను కూడా సేకరిస్తున్నారు.
బ్యాంకుకు రంధ్రం చేయడానికి రెండు మూడు గంటలు పట్టి ఉంటుందని, అయితే బ్యాంకు రద్దీ రోడ్డు పక్కగా ఉండడంతో రంధ్రం చేస్తున్న చప్పుడు వాహనాల శబ్దాల్లో కలిసిపోయి వినిపించి ఉండకపోవచ్చని పోలీసులు చెబుతున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే అత్యంత పకడ్భంధీగా జరిగిన ఈ దోపిడిలో బ్యాంకు సిబ్బంది హస్తం ఉండొచ్చన్న అనుమానంతో వారిని కూడా విచారిస్తున్నట్టు తెలిపారు. త్వరలోనే కేసును ఛేదిస్తామని పేర్కొన్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more