భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇవాళ తెల్లవారు జామున భారీ ఎన్ కౌంటర్ చోటు చేసుకుంది. దీంతో ఒక్కసారిగా తెలంగాణ ఉలక్కిపడింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నుంచి మావోయిస్టుల ఉనికి లేదని చెప్పాలి. అయితే అడపాదడపా మావోలు తమ ఉనికిని చాటుకుంటూనే వున్నారు. అయితే రాష్ట్ర ఏర్పాటు నుంచి ఇప్పటి వరకు ఇంతటి స్థాయిలో మావోలు.. పోలీసులు ఎన్ కౌంటర్ లో మరణించడంతో జిల్లా ప్రజలు అందోళనకు గురయ్యారు.
టేకులపల్లి మండలం మేలపల్లి అటవీప్రాంతంలో పోలీసులకు చండ్ర పుల్లారెడ్డి బాట దళానికి చెందిన మావోయిస్టులకు మధ్య జరిగిన కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఎన్ కౌంటర్ లో ఎనమిది మంది మావోయిస్టులు మృతి చెందినట్లు సమాచారం. టేకులపల్లి మండలంలోని మేలపల్లి అటవీ ప్రాంతంలో కొంత మంది మావోయిస్లులు సమవేశం అవుతున్నారన్న సమాచారంతో కూంబింగ్ నిర్వహించిన పోలీసులకు మావోయిస్టులు ఎదురుపడ్డారు.
దీంతో వారిని లొంగపోవాల్సిందిగా అడిగినా వారు అందుకు అంగీకరించకుండా కాల్పులకు తెగబడ్డారని, దీంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో తాము ఎదురుకాల్పులు జరిపామని చెప్పారు. దీంతో తమ కాల్పుల్లో అరుగురు మావోయిస్టులు మరణించారని పోలీసులు తెలిపారు. మవోయిస్టుల మృతదేహాలను పోలీసులు స్వాధీనం చేసుకుని అసుపత్రికి తరలించారు. పోలీసులు అరుగురే అని చెబుతున్నా.. ఎనమిది మంది మరణించారని సమాచారం.
కాగా ఈ ప్రాంతం నుంచి మావోయిస్టు అగ్రనేతలు తప్పించుకుని వుండవచ్చని, వారికి ఎస్కార్టుగా మరికొందరు మావోయిస్టులు వుండవచ్చని అనుమానిస్తున్న పోలీసులు ముమ్మరంగా కూంబింగ్ చేపడుతున్నారు. ఈ ఘటన నేపథ్యంలో భద్రద్రి జిల్లాలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more