ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యయులుగా ఎంపిక చేసేందుకు టెట్, టీఆర్టీ పరీక్షలను పెట్టి అందులో మెరిట్ ప్రాతిపదికన ఉత్తీర్ణలైన వారిని మాత్రమే ఎంపిక చేసినా.. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు మాత్రం అనుకున్నంత స్థాయిలో ఫలితాలు రావడం లేదన్న విషయాన్ని అలస్యంగా గ్రహించారు ఓ మంత్రి. ఓ ప్రభుత్వ పాఠశాలకు అకస్మిక తనిఖీ కోసం వెళ్లి పదో తరగతి విద్యార్థుల ప్రతిభను తెలుసుకునేందుకు పలు ప్రశ్నలు సంధించగా వారి నుంచి వచ్చిన సమాధానాలతో ఆయన షాక్ అయ్యారు. దీంతో విద్యార్థులకు చదువులే రానప్పుడు ప్రభుత్వ టీచర్లకు ఉద్యోగాలు, పాఠశాలలు ఎందుకుంటూ ఆయన తీవ్రస్థాయిలో అగ్రహాన్ని వ్యక్తం చేశారు.
మ్యాటర్ లోకి ఎంటరైతే.. తెలంగాణ మంత్రి జగదీశ్రెడ్డి ఉపాధ్యాయులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పిల్లలకు చదువులే చెప్పలేని, మీకు ఉద్యోగాలెందుకు ఇళ్లకు వెళ్లిపోండి అంటూ మండిపడ్డారు. ఎందుకంటే.. సూర్యాపేట జిల్లా ఆత్మకూర్ (ఎస్) మండలంలోని పాత సూర్యాపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను మంత్రి సందర్శించారు. త్వరలో 10వ తరగతి విద్యార్థులు పబ్లిక్ పరీక్షలకు హాజరవుతున్న సందర్భంగా ఆయా తరగతి విద్యార్థుల వద్దకు వెళ్లిన ఆయన ఉపాధ్యయులు తరగతులకు సక్రమంగా వస్తున్నారా..? మీకు పాఠాలు బాగా చెబుతున్నారా..? మీకు వారు చెప్పే పాఠాలు అర్థమవుతున్నాయా..? అన్న విషయాలపై అరా తీశారు.
ఆ తరువాత వారి ప్రతిభను తెలుసుకునేందుకు కొన్ని ప్రశ్నలు వేశారు. మొదటి, రెండవ ప్రపంచ యుద్ధం ఎప్పుడు జరిగిందని మంత్రి అడిగారు. ఓ సబ్జెక్టులో ఏడో పాఠం పేరు ఏమిటని ప్రశ్నించారు. విద్యార్థుల నుంచి సమాధానం రాలేదు. లెక్కలు అడగ్గా ఒక్క విద్యార్థి కూడా నోరు విప్పలేదు. దీంతో మంత్రి షాక్ అయ్యారు. గతేడాది 10వ తరగతిలో ఎంత మంది ఉత్తీర్ణులయ్యారు అని అడగ్గా, 16 మంది విద్యార్థులకు ఒకరు మాత్రమే పాస్ అయినట్లు చెప్పడంతో మంత్రి ఉపాధ్యాయులపై మండి పడ్డారు. 30 మంది విద్యార్థులకు 8 మంది ఉపాధ్యాయులు పాఠాలు చెప్పలేకపోతే ఉద్యోగాలు మానేసి ఇళ్లకు వెళ్లండి అని మండిపడ్డారు. విద్యార్థులకు చదువు రానప్పుడు పాఠశాల ఎందుకు? మూసివేయమంటూ మంత్రి వెళ్లిపోయారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more