పార్ట్టైమ్ లెక్చరర్గా పనిచేస్తున్న ఓ పెద్దావిడ గోడు విని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ చలించిపోయారు. ఆమెను రాహుల్ అక్కునచేర్చుకుని ఓదార్చడం అక్కడి వారిని విశేషంగా ఆకట్టుకుంది. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా రెండ్రోజుల పాటు ప్రచారం నిర్వహించేందుకు రాహుల్ శుక్రవారం ఇక్కడికి వచ్చారు. ఈ నేపథ్యంలో ఏర్పాటుచేసిన ఓ కార్యక్రమానికి స్కూల్ టీచర్లు, ప్రొఫెసర్లు, లెక్చరర్లు సహా అనేకమంది అధ్యాపకులు వచ్చారు.
ప్రశ్నోత్తరాల సందర్భంగా రంజనా అవస్తి అనే ప్రొఫెసర్ మాట్లాడుతూ..‘‘1994లో నేను సంస్కృతంలో పీహెచ్డీ పూర్తిచేశాను. అప్పటి నుంచి మేము దుర్భర పరిస్థితుల్లోనే కొనసాగుతున్నాం. పార్ట్టైమ్ లెక్చరర్గా ఉద్యోగం మొదలుపెట్టి 22 యేళ్లు కావస్తున్నా.. ఇప్పటికీ మా జీతం నెలకు 12 వేలుగానే ఉంది.. కనీసం మాకు మెటర్నిటీ సెలవులు కూడా ఇవ్వడం లేదు. గుజరాత్లో నాలాంటి అనేకమంది లెక్చరర్లు కనీసం హక్కులకు కూడా నోచుకోవడంలేదు...’’ అంటూ కన్నీరుమున్నీరయ్యారు.
తీరా ఇప్పుడు సర్వీసు మొత్తానికి గానూ రూ.40 వేలు ముట్టజెప్పి గుజరాత్ ప్రభుత్వం తమ ఉద్యోగాలను రద్దుచేయాలకుంటోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇతర ఉద్యోగుల్లాగనే తమకు కూడా పెన్షన్ కల్పిస్తే సమాజంలో గౌరవంగా బ్రతకగలమని రాహుల్ దృష్టికి తెచ్చారు. అవస్తి చెప్పిన విషయాలు విని చలించిపోయిన రాహుల్... కాసేపు వేదికపై మౌనంగా ఉండిపోయారు.
‘‘కొన్నిసార్లు.. కొన్ని ప్రశ్నలకు మాటలతో సమాధానం చెప్పలేం..’’ అంటూ వేదిక మీద నుంచి దిగి ఆమె వద్దకు వచ్చారు. ఆత్మీయ ఆలింగనం చేసుకుని సదరు అధ్యాపకురాలిని ఓదార్చారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే పార్ట్టైమ్ లెక్చరర్లకు కూడా పెన్షన్ సౌకర్యం కల్పిస్తామని అప్పటికప్పుడు హామీ ఇచ్చారు. ఆయన స్పందించిన తీరుతో అక్కడికి వచ్చిన వారంతా హర్షం వ్యక్తం చేశారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more