హైదరాబాద్ నగరంలోని బంజారాహిల్స్ రోడ్డు నెంబర్ పదిలో వున్న సిటీ సెంట్రల్ మాల్ లో జరిగిన ఘటనలో పోలీసులు దర్యాప్తు వేగిరం చేసి ఎట్టకేలకు అక్కడ హంగామా సృష్టించి.. దాడికి పాల్పడిన ఆ ఎంపీ కూతుర్ని గుర్తించారు. ఘటన ఎలా జరిగింది.. అందుకు కారణం ఎవరన్న వివరాలను తెలుసుకున్న పోలీసులు.. ఎంపీ కూతరిగా తనకు తాను చెప్పుకున్న యువతిని అన్వేషించే పనిలో పడి.. ఇరవై రోజుల తరువాత అమెను గుర్తించి నోటీసులు జారీ చేశారు. సిసిటీవీ ఫూటేజీ అధారంగా యువతిని గుర్తించి అమె ఎవరన్న వివరాలను తెలుసుకున్నారు.
సిటీ సెంట్రల్ మాల్ లో అంధ్రప్రదేశ్ అసెంబ్లీలో టీడీపీ శాసనసభాపక్షం కార్యాలయం కార్యదర్శిగా బాధ్యతులు నిర్వహిస్తున్న సురేష్, అతని భార్యను నెట్టుకుంటూ వచ్చి వారితో అమర్యాదగా ప్రవర్తించింది. ఎందుకు నెడుతున్నావంటూ వారిపైనే తిరగబడింది. తాను ఎంపీ కూతుర్ననని పేర్కోంది. మాల్ లోని వారు అడ్డుపడటంతో కిందకు వెళ్లింది. అయితే అంతటితో అమె ఉక్రోశం చల్లారకపోవడంతో.. వారిపై మరోమారు సెల్లార్ లో కారు పార్కింగ్ వద్ద కూడా దాడికి పాల్పడేందుకు యత్నించింది.
సెల్లార్ లో మాల్ సెక్యూరిటీతో పాటు సురేష్ భద్రతా సిబ్బంది అడ్డురావడంతో.. అమె.. సురేష్ కారు అద్దాలను ధ్వంసం చేసింది. దీంతో సురేష్ తన భార్యతో భానుతో కలసి బంజారాహిల్స్ పోలీసులకు అమె కారు నెంబరు టీఎస్ 10 ఈఎల్ 0777 నెంబరు అధారంగా పిర్యాదు చేశాడు, దీంతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు సురేష్ దంపతులపై అకారణంగా దాడికి పాల్పడిన యువతిని గుర్తించి అమెపై ఐపీసీ సెక్షన్ 323, 509, 341 కింద కేసు నమోదు చేశారు. సంజాయిషీ ఇవ్వాల్సిందిగా సీఆర్పీసీలోని సెక్షన్ 41(ఏ) కింద నోటీసులు జారీ చేశారు. ఆమె స్పందించే తీరును బట్టి చర్యలు తీసుకోనున్నారు. కేసు పూర్వా పరాల నేపథ్యంలో ఆమెను అరెస్ట్ చేసేందుకు పోలీసులు రంగం సిద్ధం చేసినట్లు తెలిసింది.
దాడికి పాల్పడింది ఎంపీ కూతురే..
టీడీఎల్పీ కార్యాలయ కార్యదర్శి సురేష్ అతని సతీమణి భానుపై దాడికి పాల్పడిన యువతి తనకు తానుగా ఎంపీ కూతుర్ని అని చెప్పకోవడంతో.. అ దిశగా దర్యాప్తు చేసిన పోలీసులు ఎట్టకేలకు అమెను గుర్తించారు. అయితే దాడి చేసిన యువతి బాలం రాయ్కు చెందిన నగల వ్యాపారి కుశాల్ జయంతి లాల్ పర్మార్ కుమార్తె భవ్య పర్మార్(20)గా గుర్తించారు. అమెరికాలో ఎంఎస్ పూర్తి చేసుకొని ఇటీవలే తిరిగి వచ్చారని, ఆ రోజు తన చిన్నమ్మ, చిన్నాన్నలతో కలిసి షాపింగ్కు వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. అయితే అమె చెప్పినట్లు అమె ఎంపీ కూతరంటే.. అమె మధ్యప్రదేశ్ (ఎంపీ) అడపడచునని చెప్పుకొచ్చిందన్నమాట. కానీ అందరూ భావించినట్లు అమె పార్లమెంటు సభ్యుల సంతతికి చెందిన యువతి కాదు. గతంలో పర్మార్ అనే వంశీయులు ఎంపీలోని మాల్వా ప్రాంతాన్ని పాలించారు. దాంతోనే అమె తాను ఎంపీ కూతుర్ని అని చెప్పకోచ్చినట్లు పోలీసులు గుర్తించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more