'హిందూ ఉగ్రవాదం' అంటూ అనుచిత వ్యాఖ్యలు చేసిన విలక్షణ సినీ నటుడు కమలహాసన్ పై దేశంలోని అనేక హిందూ సంస్థలు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తూనే వున్నారు. కమల్ హాసన్ రాజకీయాల్లోకి రావాలనే ఉద్దేశం ఉంటే మంచి పనులు చేసి రావాలని, ఇటువంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలవాలని చూడకూడదని అని సూచిస్తున్నారు. దీంతో ఆయనపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఒక మతాన్ని కించపరిచే వ్యాఖ్యలు చేసినందుకు సెక్షన్ 500 కింద కేసు నమోదు చేశారు.
అలాగే 511 సెక్షన్ కింద నేరాలకు పూనుకోవడం, సెక్షన్ 298 కింద పరుష వ్యాఖ్యలతో మతపరమైన భావాలు దెబ్బతినేలా వ్యవహరించడం, సెక్షన్ 295(ఏ) కింద మత విశ్వాసాలను కించపరచడం, మత భావాలను దెబ్బతీయడం, సెక్షన్ 505(సీ) కింద ఒక వర్గంపైన, మతంపైన దాడులు చేసేలా మాట్లాడడం వంటి అభియోగాలపై కమలహాసన్ కేసుల్లో ఇరుక్కున్నాడు. రేపు ఈ కేసులపై విచారణ జరగనుంది. కాగా, కమల హాసన్ ఈ నెల 7న తన అభిమానులతో కలిసి పుట్టినరోజు జరుపుకోనున్నారు. ఆ రోజున కొత్త పార్టీపై కమల్ ప్రకటన చేస్తారని కొందరు భావిస్తున్నారు.
కాగా కమల్ హాసన్ వ్యాఖ్యలతో మరో విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ కూడా సమర్ధించాడు. ‘సత్యమేవ జయతే’ నినాదంపై హిందువులు విశ్వాసాన్ని కోల్పోతున్నారని, దానికి బదులు శక్తిసంపన్నులుగా ఉండటమే సరైనదని భావిస్తున్నారని కమల్ చేసిన వ్యాఖ్యలను ప్రకాష్ రాజ్ సమర్థించాడు. ఈ నేపథ్యంలో కమల్ ను విమర్శించే బీజేపి నేతల సంఖ్య, హిందూ సంస్థల ప్రతినిధుల సంఖ్య తక్కువేం లేకుండా పోయింది. కమల్ మానసిక పరిస్థితి సరిగ్గాలేదని ఎద్దేవా చేశారు. కానీ కమల్ కు ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ మద్దతు లభించింది.
‘జాతి, మతం, నైతికత పేరుతో భయపెడితే తీవ్రవాదం కాదు. మరి దాన్ని ఏమంటారు?.. కేవలం అడుగుతున్నాను’ అని ప్రకాష్ రాజ్ ఈ మేరకు తన ట్వీట్టర్ అకౌంట్ ద్వారా ప్రశ్నించారు. దీంతోపాటు ‘నైతికత పేరుతో నా దేశంలోని ఓ జంటను వేధించి, శారీరకంగా చిత్రహింసకు గురి చేయడం తీవ్రవాదం కాదు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని గోవధ చేశారనే చిన్న అనుమానంతో శిక్షించడం తీవ్రవాదం కాదు. భిన్నాభిప్రాయాన్ని వ్యక్తపరిచినంత మాత్రాన వారిని విమర్శించడం, తిట్టిపోయడం తీవ్రవాదం కాదు.. మరి తీవ్రవాదం అంటే ఏంటి’ అని ప్రకాష్ రాజ్ ఓ పోస్ట్ చేశారు.
(And get your daily news straight to your inbox)
Feb 25 | కరోనా మహమ్మారి మానవాళిపై సృష్టించిన కష్టకాలాన్ని పక్కనబెడితే.. దాని పేరుతో ఇప్పుడు దేశంలో ధరఘాతం మాత్రం ఆకాశమే హద్దుగా దూసుకుపోతోంది. మరీ ముఖ్యంగా ఇంధన ధరలు సెంచరీ మార్కుకు చేరుకునేందుకు పోటీ పడుతున్నాయి. ఇప్పటికే... Read more
Feb 25 | పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ)లోని ప్రజల ధనంతో ఆర్థిక నేరానికి పాల్పడి.. దేశం నుంచి పారిపోయిన వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీకి యూనైటెడ్ కింగ్ డమ్ లోని లండన్ కోర్టు షాకిచ్చింది. గత రెండున్నరేళ్లుగా... Read more
Feb 25 | కార్మికుల సమస్యల పరిష్కారించేందుకు, వారి సంక్షేమమే ఎజెండాగా ముందుకు సాగాల్పిన కార్మిక నేత దారి తప్పాడు. కార్మిక నేత హోదాలో తోటి కార్మికుడికి తానే సమస్యగా మారాడు. తన కాలనీలోనే నివాసం ఉంటున్న మరో... Read more
Feb 25 | అమ్మాయిల కాలేజీకి వద్ద కోతుల బ్యాచ్ తిష్ట వేసింది. ఉదయం, సాయంకాలలతో పాటు రాత్రి వేళ్లలోనూ అక్కడే అవాసాన్ని ఏర్పాటు చేసుకుని కాలేజీ విద్యార్థినులతో పాటు ఉపాద్యాయులను కూడా వేధిస్తున్నాయి. ఈ కోతుల బ్యాచ్... Read more
Feb 25 | కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ త్వరలో ఎన్నికలను జరగనున్న కేరళ రాష్ట్రంలో పర్యటిస్తూ.. అక్కడి కొల్లాం జిల్లాలోని మత్య్సకారుల సమస్యలను తెలుసుకునేందుకు వారితో కలసి సముద్రయానం చేశారు. దాదాపు రెండున్నర గంటల పాటు సముద్రంలో... Read more