అధికారంలో ఏ పార్టీ అధికారంలో వుంటే సహజంగా అ పార్టీ నేతల గుండాగిరి, దౌర్జన్యకాండలు రాష్ట్రంలో పెచ్చుమీరుతాయన్న విషయం సాధారణంగా అందరికీ తెలిసిందే. అయితే ఇదే కేవలం ఇదర పార్టీ కార్యకర్తల వరకో.. లేక చిన్న చిన్న అధికారుల వరకో సాగుతుందన్న విషయం కూడా తెలుసు. కానీ ఏకంగా మున్సిపల్ కమీషనర్ ఇంటికే వెళ్లి దాడి చేసేంత తీవ్రస్థాయిలో వుంటుందని మాత్రం ఎవరూ ఊహించనిదే. కానీ అలాంటి దౌర్జన్యానికే తెలంగాణలోని ఇల్లందులో అధికార పార్టీకి చెందిన నేతలు జిల్లాలో టీఆర్ఎస్ నేతలు పాల్పడ్డారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది.
స్వచ్ఛా తెలంగాణ కార్యక్రమంలో భాగంగా ఎక్కడా పర్యావరణకు హాని కలిగించే విధంగా ఎలాంటి బ్యానర్లు.. ఫ్లెక్సీలు పెట్టకూడదని రాష్ట్ర ఐటీశాఖ మంత్రి, సీఎం కుమారుడు కేటీఆర్ అదేశాలను తూచా తప్పకుండా పాటించడమే ఆ అధికారి పాలిట శాపంగా పరిణమించింది. మంత్రి జారీ చేసిన అదేశాలను అధికార పార్టీకి చెందిన కార్యకర్తలే ఉల్లంఘించడంతో.. వాటిని పాటించాలని పూనుకున్న అధికారిపై దౌర్జన్యకాండకు దిగారు. దాడులకు తెగబడ్డారు కార్యకర్తలు.
వివరాల్లోకి వెళ్తే.. ఏ అధికార..అనధికార కార్యక్రమమైనా నేతలు ఫ్లెక్సీలు ఏర్పాటు చేయవద్దని స్వయంగా మంత్రి కేటీఆర్ కిందిస్థాయి నేతలకు సూచనలు.. ఆదేశాలు జారీ చేశారు. అయితే ఆయన జారీ చేసిన అదేశాలను ఇల్లందు పురపాలక సంఘం కమీషనర్ తూచా తప్పకుండా పాటించారు. రోడ్లపై ఎక్కడా ఎలాంటి ఫ్లెక్సీలు లేకుండా తొలగించి.. స్వచ్చా ఇల్లందుకోసం పూనుకున్నారు. అయితే నూతనంగా ఇల్లందు గ్రంథాలయ ఛైర్మన్ గా ఎన్నికైన రాజేందర్.. ప్రమాణ స్వీకారోత్సవం సందర్భంగా టీఆర్ఎస్ నేతలు ఇల్లందు పట్టణంలో భారీగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.
మున్సిపల్ నుండి అనుమతులు తీసుకోకపోవడంతో ఆ శాఖ సిబ్బంది ఫ్లెక్సీలను తొలగించారు. ఈ విషయం తెలుసుకున్న టీఆర్ఎస్ నేతలు ఆగ్రహోదగ్రులయ్యారు. మున్సిపల్ కమిషనర్ రవిబాబు ఇంటికి వెళ్లి ఆయనపై దాడి చేశారు. దీనితో ఆయన తీవ్రమనస్థాపానికి గురయ్యారు. టీఆర్ఎస్ కార్యకర్తల ఆగడాలను ఆపాలని ఆయన ఇల్లందు పీఎస్ కు వెళ్లి రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. దీనిపై ప్రభుత్వ పెద్దలు.. ఉన్నతాధికారులు ఎలా స్పందిస్తారో.. స్వచ్ఛా ఇల్లందుకు ఓటు వేస్తారా.. అధికార పక్షానికి లొంగిపోతారా..? లేకపోతే ఇద్దరి మధ్య రాజీ కుదర్చి.. కథను కంచికి పంపుతారా.? అన్నది వేచి చూడాలి.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more