సెల్ఫీ సరదాతో ఓ కొత్త జంటకు ప్రాణాల మీదకు తీసుకువచ్చింది. జీవితంలో చిరస్మరనీయమైన తొలిరాత్రి వేడుకకు కూడా దూరం చేసింది. అదెలా అంటారా.. మ్యాటర్ లోకి ఎంటైర్ అయితే.. తమిళనాడులోని నామక్కల్ జిల్లా కుమారపాళయానికి చెందిన ఇళంగోవన్ కు, కరూర్ ప్రాంతానికి చెందిన వైష్ణవితో ఈ నెల 8న వివాహం జరింగింది. ఇక పెళ్లి ముగిసిన తరువాత.. వదూవరుల కుటుంబ సంప్రదాయం ప్రకారం ఈరోడ్ జిల్లా ఊరాచ్చికోట సమీపంలోని వేదగిరి కొండపై వెలసిన శివాలయానికి వెళ్లాలి. ఆ తరువాత వారికి తొలి రాత్రి జరుగుతుంది.
దీంతో ఆ శివాలయానికి వెళ్లి స్వామివారికి ప్రత్యేక పూజలు జరిపి కాలినడకన కిందకు వస్తున్న కొత్త జంటకు సరదాగా ఓ సెల్పీ తీసుకోవాలనిపిచ్చింది. అంతే పెళ్లైన తరువాత ఏకంతంగా తన భార్యతో కలసి దిగుతున్న సెల్పీ కావడంతో.. తమతో పాటు కొండపైన వున్న సీన్ కూడా ఫోటోలో పడాలని అనుకున్నారో ఏమో తెలియదు కానీ.. ఇద్దరూ ఎంచక్కా కొండ చివరకు చేరుకుని సెల్పీకి పోజులిచ్చారు. అయితే పక్కనే వున్న లోయను కూడా వారు గమనించలేదు.
దీంతో కాలుజారిన కొత్తజంట 50 అడుగులున్న లోయలోకి పడిపోయారు. కొత్త జంట లోయలోకి పడిపోయిన విషయాన్ని గమనించిన స్థానికులు స్థానిక అలయ సిబ్బందికి తెలుపుగా, వారు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. రంగంలోకి దిగిన అగ్నమాపక సిబ్బంది వారిని రక్షించారు. అయితే ఈ ఘటనలో వధువు సృహకోల్పోయింది. కాగా ఇద్దరినీ చికిత్స నిమిత్తం అసుపత్రికి తరలించిన పోలీసులు వారి కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. సెల్పీ సరదా కొత్త జంటకు తొలిరాత్రిని దూరం చేసిందని వధూవరుల స్నేహిత్నులు చెవులు కొరుక్కుంటున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more