అరచేతిలో వైకుంఠం చూపి అధికారంలోకి వచ్చిన ప్రభుత్వాలు.. ఎన్నికల ముందు ప్రజలకిచ్చిన మాటలను నిలుపుకోవడంలో మాత్రం పూర్తిగా విఫలమవుతున్నాయి. గత ప్రభుత్వాలు చేసిన తప్పిదాలను ఎత్తిచూపి.. ఎన్నికలలో ప్రయోజనం పోందిన పార్టీలు అధికర పీఠమెక్కగానే.. ప్రజలను వారి మానన వారిని వదిలేశాయి. అడపడుచుల మాన, ప్రాణాలకు తమదీ బాధ్యత అని చెప్పిన పార్టీలు.. అబలకు ఒనగూర్చిందేమీ లేదు. గతంలో జరిగుతన్న సంఖ్య కన్నా అధికంగానే తాజాగా అడపడచులపై అఘాయిత్యాలు జరుగుతున్నాయి.
దీంతో రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయన్న వార్తలు కోడై కూస్తున్నాయి. తొలినాళ్లలో ప్రత్యేక దళాలు ఏర్పాటైనా.. అవి ప్రేమికుల వరకు మాత్రమే పరిమితం కావడం.. వారిని లక్ష్యంగా చేసుకుని దాడులు చేయడంలోనే బిజీగా మారాయి. అయితే అదను చూసి అడపడచులపై అఘాయిత్యాలకు తెగబడే మగమృగాళ్లు అన్ని ప్రాంతాల్లో పొంచివున్నాయి. తాజాగా ఉత్తర్ ప్రదేశ్ లోని రియోటీ ప్రాంతంలోని బాల్లీయాలో కాలకృత్యాలు తీర్చుకునేందుకు వెళ్లిన బాలికపై ఏఢుగురు కామాంధులు అఘాయిత్యానికి పాల్పడ్డారు.
వివరాల్లోకి వెళ్తే.. గ్రామశివార్లలో వున్న పోలాల్లోకి కాలకృత్యాలు తీర్చుకునేందుకు వెళ్లిన యువతిని.. కంచే చేను మేసిన చందంగా ఓ కానిస్టేబుల్, అపహరించుకుపోయి. స్థానికంగా వున్న ప్రభుత్వ పాఠశాల అవరణలోకి తీసుకెళ్లాడు. అప్పటికే అక్కడ పాగా వేసిన గ్రామ సర్పంచ్ బాలికపై అత్యాచారానికి తెగబడ్డాడు. ఆ తరువాత కానిస్టేబుల్, అక్కడే వున్న మరో ఐదుగురు గ్రామ యువకులు కూడా బాలికపై గ్యాంగ్ రేప్ కు పాల్పడ్డారు. ఒకరి తరువాత మరోకరుగా వంతులు వేసుకుని మరీ అత్యాచారానికి తెగబడ్డారు.
అయితే బాలిక తనను రక్షించాలని అరవడం, కేకలు వేయడంతో.,. వాటిని విన్న గ్రామస్థులు కొందరూ వెతుక్కుంటూ గ్రామ పాఠశాల అవరణలోకి చేరుకున్నారు. గ్రామస్థులను రాకను చూసిన ఐదుగురు నిందితులు అక్కడి నుంచి తప్పించుకుని పారిపోగా, కానిస్టేబుల్, గ్రామ సర్పంచ్ మాత్రం అక్కడే వుండటంతో వారిద్దరిని స్థానికులు చావ చితకొట్టారు. తన కూతురిపై ఏడుగురు దుండగులు అత్యాచారానికి పాల్పడ్డారన్న విషయం తెలుసుకున్న ఆ బాలిక తండ్రి గుండెపోటుకు గురై హఠాన్మరణం చెందాడు.
ఉత్తర ప్రదేశ్లోని బాల్లీయా ప్రాంతం రియోలో జరిగిందీ దారుణం. బాధితురాలు ఈ ఘోరం నుంచి తప్పించుకునేందుకు గట్టిగా కేకలు వేయడంతో గ్రామస్తులు పరుగున సంఘటనా స్థలానికి వెళ్లారు. స్థానికులు రావడం చూసి కానిస్టేబుల్ అక్కడి నుంచి పారిపోయాడు. కూతురిపై జరిగిన దారుణం తెలిసి ఆమె తండ్రి రోదిస్తూ అక్కడికక్కడే కుప్పకూలిపోయినట్టు కుటుంబసభ్యులు తెలిపారు. గోపాల్నగర్ పోలీస్ ఔట్ పోస్టులో కానిస్టేబుల్గా పనిచేస్తున్న నిందితుడిని అధికారులు ఇప్పటికే సస్పెండ్ చేశారు. అత్యాచారం కేసులో అరెస్టు చేసి జైలుకు తరలించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more