దేశ ఆర్థిక రాజధాని నగరం ముంబైలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. తూర్పు ముంబైలోని ఓ నాలుగంతస్థుల భవనం కుప్పకూలింది. ఈ ఘటనతో సుమారు 9 మంది సజీవ సమాధి కాగా, మరో 40 మంది శఇధిలాల కింద చిక్కుకున్నారు. బంధువుల రోధనలతో పరిస్థితి హృదయవిదారకంగా మారింది. ఘాట్ కోపర్ ప్రాంతంలో సంభవించిన ఈ ఘటన సమాచారాన్ని అందుకున్న రెస్క్యూ టీమ్ లు రంగంలో కి దిగి శిథిలాల కింద చిక్కుకు్న వారిని రక్షంచే ప్రయత్నం చేస్తున్నారు. కాగా శిధిలాల కింది చిక్కకున్న వారిలో కొందరి పరిస్థితి విషమంగా వుందని సమాచారం.
ఉదయం పదిన్నర గంటలకు ఈ ప్రమాధం సంభవించగా, మధ్యాహ్నం వరకు శిథిలాల కింద చిక్కుకున్న 9 మందిని రెస్క్యూ టీమ్ సభ్యులు రక్షించారు. మరో 30 మంది శిథిలాల కింద చిక్కుకున్నట్లు సమాచారం. వారిని వెలికి తీయడానికి శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. మొత్తం 8 ఫైర్ ఇంజన్లు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నాయి. రెస్క్యూ వ్యాన్, 108 అంబులెన్స్ కూడా వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. అయితే ఇవాళ పనిదినం కావడం.. దీంతో ఇళ్లలోని వారు కార్యాలయాలకు, బడులు, కాలేజీలకు వెళ్లిన తరువాత ఈ ప్రమాదం జరగడంతో.. తక్కువ సంఖ్యలోనే బాధితులు చిక్కుకున్నారని తెలుస్తుంది.
భ్రిహన్ ముంబై మున్పిఫల్ కార్పోరేషన్ కంట్రోల్ రూమ్ కు ఉదయం 10.43 గంటలకు భవనం కుప్పకూలినట్లు ఫోన్ వచ్చింది. వెంటనే స్పందించిన అధికారులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదంలో ఇంకా ఎవరైనా మరణించారా అనే విషయాలు తెలియాల్సి ఉంది. అప్రమత్తమైన స్థానికులు వెంటనే ముంబై నిర్వహణ బృందానికి సమాచారమిచ్చారు. దీంతో వారు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక బృందాలే చర్యలు చేపట్టాయి. భవన శిథిలాల కింద 40 నుంచి 50 మంది వరకు చిక్కుకుని ఉంటారని అధికారులు చెబుతున్నారు.
మృతుల్లో ఎక్కువగా చిన్నారులు, వృద్ధులే ఉన్నట్లు తెలియవచ్చింది. రెండు వారాల నుంచి భారీగా వర్షాలు కురుస్తుండడం, అది పాత భవనం కావడంవలనే కూలిపోయిందని అధికారులు చెప్పారు. అందులో నివశిస్తున్న కుటుంబాలను ఖాళీ చేయమని చెప్పినా చేయలేదని అధికారులు తెలిపారు. సుమారు 60 మంది వరకు ఆ భవనంలో ఉంటున్నట్లు సమాచారం. కాగా మరో జాతీయ దినపత్రిక మాత్రం అక్రమంగా నిర్మాణాలను చేపట్టడం వల్లనే ఈ ప్రమాదం సంభవించిందని అనుమానాలను వ్యక్తం చేసింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more