బాల్యంపై బండ రాయిలుగా మారుతున్న బ్యాగులు చూస్తే పెద్దలకే భయం వేయటం ఖాయం. అంతేసి బరువులు వాళ్లు ఎలా మోస్తారో అంటూ ఒక్కోసారి తలుచుకుంటేనే బాధ వేస్తుంది. అసలు ఈ వయసులో అన్ని పుస్తకాలు అవసరమా? అనే ప్రశ్న అందరనీ తొలుస్తుంది. అయితే ఈ విషయంలో తెలంగాణ విద్యాశాఖ ఓ శుభవార్త చెప్పింది. చిన్నారులకు సంచి బరువుతోపాటు, హోంవర్క్లను కూడా తగ్గిస్తూ విద్యాశాఖ మార్గదర్శకాలు రూపొందించి విద్యాశాఖ స్పెషల్ సీఎస్ రంజీవ్ ఆర్ ఆచార్య జీవో 22ను జారీ చేశాడు.
హమాలీ పని చేస్తున్నట్టు, బరువైన స్కూల్ బ్యాగులతో పోయే విద్యార్థులను చూస్తుంటాం. కానీ, తాజా ఆదేశాలతో నడుం వంగిపోయేలా పుస్తకాలు మోస్తున్న పిల్లలకు ఇక ఊరట లభిస్తుంది. వైద్యులు చెబుతున్నట్లు వారి ఎదుగుదలపై ప్రతికూల ప్రభావం చూపిస్తున్న ఈ అంశంపై ప్రభుత్వం తాజా నిర్ణయం తీసుకుంది. ప్రాథమిక స్థాయిలో పుస్తకాల సంచి బరువు 6 నుంచి 12 కిలోలు, ఉన్నత పాఠశాల స్థాయిలో 12 నుంచి 17 కిలోలు ఉన్నట్టు గుర్తించారు. ఈ బరువు కారణంగా విద్యార్థుల వెన్నెముక, మోకాళ్లు దెబ్బతినే అవకాశం ఉందని నిర్ధారణకు వచ్చారు. దీంతో తరగతుల వారీగా పుస్తకాల బరువు గరిష్టంగా ఎంత ఉండాలో పేర్కొంటూ మంగళవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
రాష్ట్ర విద్యాపరిశోధన, శిక్షణ మండలి (ఎస్సీఈఆర్టీ) నిర్దేశించిన ప్రకారం పాఠ్యపుస్తకాలు ఉండాలని, గైడ్లు, అనవసర విద్యాసంబంధ పుస్తకాలను ప్రోత్సహించరాదని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. అలాగే ఐదో తరగతి వరకు పిల్లలకు హోంవర్క్ ఇవ్వరాదని, బడిలోనే దానిని చేయించాలని, అవసరమైతే అందుకోసం ప్రత్యేకంగా ఓ పిరియడ్ కేటాయించాలని పేర్కొంది.
సాధారణ మార్గదర్శకాలు
రాష్ట్ర అకడమిక్ అథారిటీ లేదా ఎస్సీఈఆర్టీ నిర్దేశించిన పాఠ్య పుస్తకాలను మాత్రమే ఉపయోగించాలి.
ప్రతి తరగతికి ఎస్సీఈఆర్టీ నిర్దేశించిన పుస్తకాల సంఖ్య దాటరాదు.
కాన్సె్ప్టని విద్యార్థులు అవగాహన చేసుకునేలా చేయాలి. బట్టీ పట్టించడం మంచిది కాదు. చదవడానికి, భావ వ్యక్తీకరణకు స్వేచ్ఛనివ్వాలి.
పాఠశాల సమయంలో, ఆ తర్వాత గైడ్లను ఉపయోగించకూడదు. విద్యార్థుల సమగ్ర మూర్తిమత్వ వికాసానికి పాటుపడాలి.
గ్రంథాలయంలోని పుస్తకాలను చదివించాలి. ఆటలు, కళలు, సాంస్కృతిక విభాగాలు, సహ పాఠ్యాంశాల్లో పాల్గొనేలా విద్యార్థులను ప్రోత్సహించాలి.
గైడ్లు, గైడు పుస్తకాల వినియోగాన్ని 2014 మే 14న జారీ చేసిన జీవో 17 ద్వారా నిషేధించారు. పాఠ్య పుస్తకంలోని ప్రశ్నలు, ఇతర అంశాలను విద్యార్థులే స్వంతంగా రాసేలా చూడాలి. ఉపాధ్యాయులు అవసరమైన చోట సరిదిద్దాలి.
పాఠశాల సమయాలు, పరీక్షల నిర్వహణ, మూల్యాంకనం తీరు సహా అకడమిక్ క్యాలండర్లో పేర్కొన్న అన్ని అంశాలపై అవగాహన ఉండాలి.
సాయంత్రం వేళల్లో ట్యూషన్లు, రాత పనిలో నిమగ్నం చేసే బదులు ఆటల్లో పాల్గొనడానికి విద్యార్థులను ప్రోత్సహించాలి.
1, 2 తరగతుల విద్యార్థుల స్కూల్ బ్యాగు బరువు 1.5 కిలోలకు మించకూడదు. 3, 4, 5 తరగతులకు 3 కిలోల్లోపు; 6, 7 తరగతులకు 4 కిలోల్లోపు, 8, 9, 10 తరగతులకు 5 కిలోల్లోపు ఉండాలి.
వీటితోపాటు ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలకు, ప్రాథమిక పాఠశాలలకు విడివిడిగా ప్రత్యేక మార్గదర్శకాలను కూడా రూపొందించి విడుదల చేసింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more