మనిషిలో అత్యాశ ఎంతటి పనులకైనా ప్రేరేపిస్తుందనడానికి ఇదే నిదర్శనం. మంత్రాల నేపంతో ఉన్న అభరణాలను రెట్టింపు చేస్తానని ఆశలో పడి లైఫ్ స్టైయిల్ భవన యజమానిని మత్తులో ముంచి దొరకినకాడికి కాసులు తీసుకుని చెక్కేసిన ఘనులను ఉదంతం వెలుగు చూసిన తరువాత ఎంతటి వారైనా ఇకపై అప్రమత్తంగా వుండాలని సంకేతాలను పోలీసులు ప్రజల్లోకి తీసుకెళ్లారు. అయితే అప్పడప్పుడూ అక్కడక్కడా మంత్రగాళ్ల మాటల గారఢిలో అనేక మంది తాము కస్టించి సంపాదించిన డబ్బును అత్యాశ దూరం చేస్తూనే వున్నాయి.
అయితే తాజాగా పరకాల ఎమ్మెల్యే ధర్మారెడ్డికి కూడా మాటల మాంత్రికులు కుచ్చుటోపి పెట్టారు. తెలుగుదేశం పార్టీ నుంచి ఫిరాయింపుకు పాల్పడి ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్ రావుతో పాటు అధికార టీఆర్ఎస్ పార్టీలోకి చేరిన ధర్మారెడ్డికి మంత్రి పదవి దక్కాలంటే.. ప్రత్యేక పూజలు చేయాలని.. అందుకు గాను కొంత ఖర్చు అవుతుందని మాయమాటలు చెప్పి ఏకంగా కుచ్చుటోపి పెట్టారు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 57 లక్షల రూపాయల మేర తమకు తాము కోయదొరలుగా చెప్పుకున్న ఇద్దరు చేతిలో మానస రెడ్డి మోసపోయారు. ఈ వార్త వెలుగుచూడటంతో అది సంచలనంగా మారింది.
మంత్రాల పేరుతో ఇద్దరు కోయదొరలు.. వరంగల్ జిల్లా పరకాల ఎమ్మెల్యే ధర్మారెడ్డి కూతురు మానసరెడ్డిని మోసం చేశారంటూ వరంగల్ సుబేదారి పీఎస్ లో కేసు నమోదైంది. తన కోడల్ని మోసం చేశారంటూ ధర్మారెడ్డి వియ్యంకుడు బాల్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కరీమాబాద్ కు చెందిన నర్సింహారాజు, రాజు అనే ఇద్దరు కోయ దొరలు పూజలు చేస్తే మంచి జరుగుతుందని నమ్మించారు. దీంతో విడతల వారీగా అక్షరాల 57లక్షల రూపాయలు ఇచ్చింది మానసారెడ్డి. ఇదే విషయాన్ని కంప్లయింట్ లో వివరించారు బాల్ రెడ్డి. ఇద్దరు కోయదొరలు నర్సింహరాజు, వంశీపై చీటింగ్ కేసు పెట్టారు పోలీసులు.
దేశవ్యాప్తంగా ఉన్న గుళ్లు, గోపురాలు, శక్తిపీఠాల్లో పూజలు, హోమాలు, అన్నదానం చేస్తే కష్టాలు తీరతాయని మానసారెడ్డిని నమ్మించారు కోయదొరలు. ఏడాది కాలంగా రెండు, మూడు, నాలుగు లక్షల చొప్పున ఇప్పటి వరకు రూ.57లక్షలు ఇచ్చారామె. ఇంట్లో కష్టాలు తీరాలని చెబుతున్నా.. ఆరోగ్యం బాగుంటుందని.. రోగాలు నయం అవుతాయనే ఉద్దేశంతోనే ఈ పూజలు చేసినట్లు సమాచారం. వరంగల్ లోని తన బంధువుల ద్వారా ఈ కోయదొరలు పరిచయం అయ్యారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more