తెలంగాణ రాష్ట్రంలో ఫ్రెండ్లీ పోలీసింగ్ అనే మాట వరుసకు మాత్రమే వినిపిస్తుండగా.. కొందరు చేసే వ్యవహారాలు మాత్రం మరోలా ఉంటాయి. ఫుట్ పాత్ మీద చిరు వ్యాపారస్థులపై దాడులు, లంచం తీసుకుని వాహనదారులను వదిలేయటం... మంత్రులు, పై అధికారుల స్థాయికి వెళ్తున్నప్పటికీ ధోరణి మాత్రం మారటం లేదు. ఇక ఇప్పుడు మహిళల భద్రత పైనే సందేహాలు వ్యక్తం చేస్తూ ఓ మహిళ చేసిన పోస్ట్ తీవ్ర చర్చకు దారితీసింది.
వర్ష భార్గవి అనే ఓ మహిళ చేసిన పోస్ట్ తెగ వైరల్ అవుతోంది. అపురూప టౌన్ షిప్ లో గత నెల 30న ఓ వృద్ధుడు నిద్రపోతున్న వేళ, సహాయకుడు ఇంట్లో దొంగతనం చేసి పారిపోయాడు. చుట్టుపక్కల వారు కుమార్తెకు విషయం తెలియజేశారు. ఫిర్యాదు చేసేందుకు జీడిమెట్ల పోలీస్ స్టేషన్ కు ఆమె 6వ తేదీన వెళ్లగా, ఘటనా స్థలిని చూడాలని పోలీసులు కోరారు. దీంతో అపురూప కాలనీలోని తన ఇంటికి సదరు యువతి ఇద్దరు కానిస్టేబుళ్లను తీసుకు వెళ్లింది.
ఓ కానిస్టేబుల్ వివరాలు రాసుకుంటుంటే, మరో కానిస్టేబుల్ ఆమెను తేడాగా చూడటం ప్రారంభించాడు. దాదాపు 15 నిమిషాల పాటు అతను అదే పనిలో ఉన్నాడు. ఈ విషయాన్ని అదే రోజున బాధితురాలు తెలంగాణ పోలీస్ ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేశారు. "జీడిమెట్ల పోలీస్ స్టేషన్ కు చెందిన ఆ కానిస్టేబుల్ తన దృష్టిని నా ఎడమ వక్షోజంపైనే తదేక దృష్టితో చూశాడు. నేను ఫిర్యాదు చేస్తుంటే, ఈ పనేంటి?" అని ట్వీట్ లో ప్రశ్నించింది.
ఈ ట్వీట్ ను చూసిన బాధితురాలి స్నేహితుడు ఒకరు, డిజీపీ ట్విట్టర్ ఖాతాకు రీ ట్వీట్ చేశాడు. దీన్ని చూసిన డీజీపీ సైబరాబాద్ పోలీసులకు ఫార్వార్డ్ చేయగా, ఈ విషయమై ఇప్పటి వరకూ ఎటువంటి చర్యలూ తీసుకోలేదని సమాచారం. పైగా బాధితురాలు ఓ సోషల్ వర్కర్ కావటంతో ఎలా రియాక్ట్ అవుతారోనని అంతా వేచి చూస్తున్నారు.
@TelanganaPolice why was the police constable in Jeedimetla PS kept his gaze fixed on my left breast while I was reporting theft?
— Varsha (@VarshaBhargavi) June 6, 2017
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more