అంతర్జాతీయ న్యాయస్థానం (ఐసీజే) దృష్టికి కాశ్మీర్ అంశాన్ని తీసుకెళ్లే దమ్ము పాకిస్థాన్కు లేదని విదేశాంగ శాఖామంత్రి సుష్మాస్వరాజ్ బొల్డ్ స్టేట్ మెంట్ ఇచ్చారు. ఈ అంశాన్ని ద్వైపాక్షిక చర్చల ద్వారానే భారత్, పాకిస్తాన్ లు పరిష్కరించుకోవాల్సి ఉంటుందని అమె మరోమారు తేల్చిచెప్పారు. కాశ్మీర్ సహా సరిహద్దులో కాల్పుల విరమణ ఒప్పందం.. సరిహద్దు తీవ్రవాదం అంశాలను కూడా దైపాక్షిక చర్చల ద్వారానే పరిష్కారించుకోవాలని తాము భావిస్తున్నట్లు సుష్మాస్వరాజ్ తెలిపారు. దాయాది దేశానికి, తమకు మధ్య మూడు వ్యక్తి కానీ, దేశం కాని జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని తాము భావిస్తున్నామని అన్నారు.
అయితే ఉగ్రవాదం, చర్చలు రెండూ కుదరని పని అని కుండబద్దలు గొట్టారు. చర్చలు ముందుకు సాగాలంటే అది పాక్ చేతిలోనే వుందని.. అ దేశం ఎప్పడు ఉగ్రవాదానికి స్వస్తి పలుకుతుందో అప్పుడే చర్యలకు తాము ముందుకు సాగుతామని సుష్మా తేల్చిచెప్పారు. ఇక అమెరికాతో బరాక్ ఒబామా ఉన్నప్పుడు కొనసాగిన సంబంధాలే ప్రస్తుతం డోనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడైన తరువాత కూడా కొనసాగుతున్నాయన్నారు. ఇప్పటికే మూడు పర్యాయాలు ట్రంప్ మోదీకి ఫోన్ చేసి మాట్లాడారని కూడా అమె చెప్పారు.
తాము ఏ ప్రయోజనాలను అశించి పారిస్ ఒప్పందాలను అమోదం తెలపలేదని సుష్మా స్వరాజ్ అన్నారు. ఈ విషయమై డోనాల్ట్ ట్రంప్ చేస్తున్న అరోపణలను అమె తీవ్రంగా ఖండించారు. అదే సమయంలో పారిస్ ఒప్పందాల నుంచి వైదోలగాలన్న ట్రంప్ నిర్ణయంతో భారత్ అమెరికా దేశాల మధ్య వున్న సంబంధాలపై ఏ మాత్రం ప్రభావం పడబోదని చెప్పారు. గత మూడేళ్లుగా వివిధ దేశాలలో వున్న 80 వేల మంది భారతీయులను సురక్షితంగా స్వదేశానికి రప్పించగలిగామని సుష్మాస్వరాజ్ తెలిపారు.
(And get your daily news straight to your inbox)
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more
Oct 07 | గుజరాత్ పోలీసులు స్థానిక యువతపై కాకీ కాఠిన్యాన్ని ప్రదర్శించారు. ఓ వర్గానికి చెందిన యువతపై ఇలా విరుచుకుపడటం ఇప్పుడు రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. సబ్ కా సాత్, సబ్ కా వికాస్ అంటూ కేంద్ర,... Read more