కుటుంబపోషణ కోసం పరాయి దేశం వెళ్లి కష్టపడి డబ్బులు సంపాదిస్తున్న భర్త ఎప్పుడెప్పుడు వస్తాడా..? అని ఎదురుచూసే వాళ్ల సంఖ్య మన దేశంలో తక్కువేం లేదు. దేశంలో వందల షంఖ్యలోమగవాళ్లు తమ కుటుంబాల పోషణ కోసం దేశం కానీ దేశాలకు వలస వెళ్లారు. అయితే తమ వారు అక్కడ ఎలా వుంటున్నారు..? అరోగ్యంగా వుంటున్నారా..? లేదా..? అన్న సమాచారంతో పాటు వారి యోగక్షేమాలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూనే వుంటారు. అయితే ఇలాంటి వారికి భిన్నంగా వుండే అతికొద్ది మంది వారితో పాటుగా వారి కుటుంబాలకు, తల్లిదండ్రులకు కూడా అప్రతిష్టను మూటగడుతుంటారు.
సరిగ్గా ఇలాంటి ఘటనే తమిళనాడులోని జరిగింది. రాష్ట్రంలోని వేలూరు జిల్లా, నాట్రాంపల్లి సమీపాన మూక్కనూరు గ్రామానికి చెందిన కుమార్.. తన భార్య, అమె ప్రియుడితో కలసివుండగా రెడె హ్యండెండ్ గా పట్టించి పోలీసులకు అప్పగించాడు. వివరాల్లోకి వెళ్తే 28 ఏళ్ల కుమార్కు కొన్నేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఐదేళ్ల కుమార్తె ఉంది. పాప భవిష్యత్తు కోసం అలోచించిన కుమార్ నాలుగు రాళ్లు వెనకేసుకోవాలంటే.. విదేశాలకు వెళ్లి పనిచేయాలని భావించి పెళ్లైన కొద్ది నెలలకు సింగపూర్కు వెళ్లాడు.
భర్త యోగక్షేమాలను తెలుసుకుంటు అతని కోసం వేచిచూడాల్సిన భార్యకు.. ముక్కనూరు గ్రామానికి చెందిన దేవేంద్రన్ అనే 23 ఏళ్ల యువకుడితో పరిచయం ఏర్పడింది. అది కాస్తా శారీరిక సంబంధాలకు దారితీసింది. వీరి వివాహేతర సంబంధం గురించి తెలుసుకున్న కుమార్ తల్లిదండ్రలు విషయాన్ని కొడుకుకు చేరవేశారు. దీంతో సింగపూర్ నుంచి ముక్కనూరుకు తిరిగి వచ్చిన కుమార్.. దేవేంద్రన్ అనే యువకుడితో సంబంధాన్ని వదులుకోమని భార్యకు చెపాడు.
ఈ విషయంలో కొద్దిగా సీరియస్ అయిన భర్త మాటలను పెడచెవిన పెట్టిన భార్య.. తరచూ ఇద్దరి మధ్య ఏర్పడతున్న గొడవలను అసరాగా చేసుకుని ఏకంగా విలగనత్తంలోని తన పుట్టింటికి వెళ్లింది. తర్వాత భార్యను తీసుకువచ్చేందుకు కుమార్ వెళ్లలేదు. అయితే భార్య ప్రవర్తనతో సింగపూర్ వెళ్లే అవకాశాలను వదులుకున్న కుమార్.. స్థానికంగా సేలంలోని ఓ బేకరీలో పనికి చేరాడు. ఇదే సమయంలో మూక్కనూరు నుంచి దేవేంద్రన్ తరచూ విలగనత్తంకు వెళ్తున్నాడని కుమార్ తెలుసుకుని ఇద్దరినీ రెడ్హ్యాండెడ్గా పట్టుకోబాలని భావించాడు.
ఈ క్రమంలో క్రితం రోజు రాత్రి వేళ తన భార్య ఇంటికి దేవేంద్రన్ వెళ్తున్నాడని సమాచారం అందుకుని అతనిపై నిఘా ఉంచాడు. రాత్రి 11 గంటల సమయంలో తన భార్య ఇంటికి వెళ్లిన దేవేంద్రన్ ను చూసిన కుమార్.. ఇద్దరు ఇంట్లో బిజీగా వుండగా సవ్వడి కాకుండా ఇంటి బయట తాళం వేశాడు. తర్వాత ఇరుగుపోరుగ వారిని పిలిచి తన భార్య నడుపుతున్న అక్రమ సంబంధ బండారాన్ని భయటపెట్టాడు. ఊరి ప్రజల వారిని నిగ్గదీసి అడగటంలో విషయం గ్రామస్థులకు తెలిసిపోయింది. దీంతో వారు పోలీసులకు సమాచారం అందించగా.. నాట్రాంపల్లి పోలీసులు వచ్చి ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more