దేశప్రజల ప్రాణాలను సరిహద్దులో వుండి కాపాడుతున్న ఆర్మీ అంటే వారేదో సాహసాలు చేసినప్పుడో, ప్రకృతి విపత్తులలో సాయం చేసినప్పుడో, లేక యుద్దంలో గెలిచినప్పుడో కాదు, వారు కనిపించగానే కరతాళధ్వనులతో వారికి గౌరవ సూచకాన్ని తెలియజేయాలని ప్రధాని నరేంద్రమోడీ దేశ ప్రజలకు సూచించిన విషయం తెలిసిందే. అయితే అదే ఆర్మీలో సేవలందిస్తూ.. తాము కనీసం మంచి బోజనానికి కూడా నోచుకోలేకపోతున్నామని చెప్పిన తేజ్ బహదూర్ తాజాగా విడుదల చేసిన వీడియోలో తనను పాకిస్థాన్ తో లింకుపెట్టి మరీ మనోవేధనకు గురిచేస్తున్నారని చెప్పడం అందోళనకు గురిచేస్తుంది.
ఈ తరుణంలోనే సహాయక్ విధానంలో సమస్యలు బయటపెట్టిన సైనికుడు రాయ్ మాథ్యూ అనుమానాస్పందంగా మృతిచెందిన ఘటన కూడా తీవ్ర చర్చకు దారితీసింది. ఈ ఘటనను మరవకముందే.. మరో జవాను తన ఆవేదనను చెప్పేందుకు ముందుకొచ్చాడు. సహాయక్ ఉద్యోగం అంటే సైనికులకు శిక్ష లాంటిదేనంటూ ఫేస్బుక్లో ఓ వీడియో పోస్టు చేశాడు. ఈ విధానానికి వ్యతిరేకంగా సింధవ్ జోగిదాస్ అనే జవాను మాట్లాడిన వీడియో ఒకటి ఇప్పుడు ఆన్లైన్లో వైరల్గా మారింది.
ఆర్డర్లీ పనిచేసే జవాన్లను అధికారులు చిన్నచూపు చూస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశాడు. సెలవుల నుంచి ఆలస్యంగా వచ్చినందుకు తమను దారుణంగా శిక్షిస్తున్నారని జోగిదాస్ అన్నాడు. ఈ విషయాలపై ఫిర్యాదులు చేసినా కూడా తమను శిక్షిస్తారని చెప్పాడు. తమ సమస్యలపై ఉన్నతాధికారులు కూడా స్పందించడంలేదన్నాడు. ‘సహాయక్ ఉద్యోగం చేయనని చెప్పినప్పటి నుంచి అధికారులు నన్ను వేధిస్తున్నారు. నన్ను ఏడు రోజుల పాటు ఆర్మీ కస్టడీలో ఉంచారు’ అంటూ జోగిదాస్ వీడియోలో మాట్లాడాడు.
అనుమానాస్పదంగా మృతిచెందిన రాయ్ మాథ్యూ ఘటన తర్వాత ప్రస్తుతం ఈ వీడియో వైరల్గా మారింది. ఆర్మీలో సహాయక్ అన్న పదం కేవలం శిక్ష విధించడానికేనన్న జోగిదాస్ వీడియోతో ఉన్నతాధికారులు జూనియర్లతో చేయిస్తున్న పనులు కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. సైన్యంలో అధికారుల ఇళ్ల వద్ద జవాన్లు పనులు చేసే సహాయక్(ఆర్డర్లీ) విధానంపై ఓ వార్తాపోర్టల్ జరిపిన శూలశోధనలో రాయ్ మాట్లాడి.. సమస్యలను బయటపెట్టాడు. అయితే కొద్ది రోజులకే రాయ్ అనుమానాస్పద మత్యువాత పడ్డాడు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more