తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపిన ఓటుకు నోటు కేసులో చంద్రబాబుకు ఫ్రెష్ షాక్ తగిలింది. సుప్రీంకోర్టు లో దాఖలైన పిటిషన్ ఆధారంగా ఏపీ సీఎంకు నోటీసులు జారీ చేసింది. సోమవారం దానిని విచారణకు స్వీకరిస్తున్నట్లు తెలిపింది కూడా. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఈ కేసులో ప్రత్యక్ష ప్రమేయముందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిన విషయం తెలిసిందే. చంద్రబాబును ప్రాసిక్యూట్ చేయాలని అందులో ఆయన పేర్కొన్నారు.
అయితే గతంలో ఈ కేసులో హైకోర్టులో చంద్రబాబుకు ఊరట లభించింది. తాజాగా సుప్రీం మాత్రం ఆళ్ల వేసిన పిటిషన్ను విచారణకు స్వీకరించడంతో మరోసారి చర్చనీయాంశంగా మారింది. మరోవైపు ఓటుకు నోటు నుంచి చంద్రబాబు తప్పించుకోవడం అసాధ్యమని ఆళ్ల తరపు న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డి చెబుతున్నాడు.
వీలైనంత త్వరగా కౌంటర్ దాఖలు చేయాలంటూ చంద్రబాబుకు కోర్టు ఆదేశాలు జారీ చేయటం, కేసును కూలంకశంగా దర్యాప్తు చేస్తామని ధర్మాసనం ప్రకటించటం చూస్తుంటే క్యాష్ ఫర్ ఓట్ కేసు చాలా తీవ్రమైందని కోర్టు భావిస్తున్నట్లు స్పష్టమౌతుందని పొన్నవోలు అంటున్నాడు. ఈ కేసులో న్యాయం తమ పక్షానే ఉంటుందన్న ఆయన, అందుకు సంబంధించిన తగిన పక్కా సాక్ష్యాలను విచారణ సమయంలో న్యాయమూర్తి ముందు ప్రవేశపెడతామని ప్రకటించాడు.
మరోవైపు ఇప్పటిదాకా ఈ వ్యవహారంలో జోక్యం కల్పించుకోని గవర్నర్ నరసింహన్ కూడా కేసును సంబంధించిన సీక్రెట్ ఫైళ్లను తెప్పించుకోవటం ఆసక్తికరంగా మారింది. అయితే ఆ వార్త జగన్ కు సంబంధించిన ఓ పత్రికలో మాత్రమే ప్రచురితం అయ్యిందని కేసులో ఆరోపణలు ఎదుర్కుంటున్న సెబాస్టియన్ చెబుతున్నాడు.
(And get your daily news straight to your inbox)
Aug 17 | స్వాతంత్ర్య వజ్రోత్సవ వేడుకల వేళ.. ప్రధాని నరేంద్రమోడీ ఎర్రకోటపై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన సందర్భంగా చేసిన ప్రసంగానికి ఆ మరుసటి రోజున.. బీజేపి పాలిత రాష్ట్రంలోనే తూట్లు పోడిచారు. ప్రధాని మోడీ సోంత రాష్ట్రం... Read more
Aug 17 | జేబులో డబ్బులు పెట్టుకుని తిరిగితే.. ఎవరైనా జేబు దొంగలు కొట్టేస్తారేమో అన్న అందోళన అవసరం లేకుండా.. ఎంచక్కా.. డిజిటల్ పే వచ్చేసింది. ఇక ఎదో ఒకచోట డబ్బు అవసరం అయితే.. అక్కడికక్కడే కనిపించే ఏటీఎంకు... Read more
Aug 17 | మహారాష్ట్రలో ఘోర ప్రమాదం సంభవించింది. మహారాష్ట్రలోని గోండియా జిల్లాలో ఎదురెదురుగా వస్తున్న రెండు రైళ్లు ఢీకొన్నాయి. ఎదురుగా వస్తున్న గూడ్సు రైలును.. అదే మార్గంలో వస్తున్న ప్యాసింజర్ రైలు ఢీకొట్టింది. దీంతో ప్యాసింజర్ రైలులోని... Read more
Aug 17 | మధుమేహ రోగులకు శుభవార్తను అందించారు వైద్యశాస్త్ర పరిశోధకులు. కరోనా మహమ్మారి బారిన పడిన మధుమేహ వ్యాధిగ్రస్తులు దాని నుంచి బయటపడేందుకు మానసికంగా, శారీరికంగానూ చేసిన పోరాటం వల్లే అనేక మంది బతికి బయటపడగా, కొందరు... Read more
Aug 17 | కలియుగ వైకుంఠంగా బాసిల్లుతున్న తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు కరోనా మహమ్మారికి మునుపటి స్థితికి చేరుకుని ఇప్పుడిప్పుడే భక్తులకు ఆలవాలంగా మారుతోంది. ఈ తరుణంలో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్... Read more