ఉత్తరప్రదేశ్ రాజకీయాలు ఎప్పుడు ఎలాంటి మలుపు తిరుగుతాయో చెప్పలేం. ఇక అధికార పార్టీ సమాజ్ వాదీలో ఏర్పడిన కుటుంబవివాదాల నేపథ్యంలో అసలు పార్టీ ఎటువైపు పయనిస్తుందన్న విషయం రాజకీయ విశ్లేషకులు కూడా అంచానా వేయలేకపోతున్నారు. అంతలా ట్విస్టులు, యు టార్న్ లు తీసుకుంటూనే ఎన్నికల బరిలోకి దిగుతున్నారు అభ్యర్థులు. తాజాగా సమాజ్ వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ మరోసారి యూటర్న్ తీసుకుని పార్టీ తరుపున ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థులకు ట్విస్ట్ ఇచ్చారు.
కాంగ్రెస్ పార్టీతో పోత్తు పెట్టుకోవడంపై నిన్న కాక మొన్న అంతెత్తున లేచిన ములాయం సింగ్.. తన కుమారుడు ఎందుకిలాంటి నిర్ణయం తీసుకున్నాడో అర్థం కావడం లేదని అన్నారు. ఒంటరిగా పోటీ చేసి కూడా పార్టీని అధికారంలోకి తీసుకువచ్చే అవకాశం వున్నా.. కాంగ్రెస్ పార్టీతో పోత్తుపెట్టుకోవడం ఎందుకని ప్రశ్నించాడు. ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో సమాజ్ వాదీ పార్టీ, కాంగ్రెస్ పొత్తును తాను అంగీకరించనని స్పష్టం చేశారు. ఈ కూటమి తరపున ఎన్నికల ప్రచారంలో పాల్గొనబోనని ప్రకటించారు.
ఇలా చెప్పిన తరువాత మరుసటి రోజునే తన మనస్సును మార్చుకున్నారు. తాను తన పార్టీ అభ్యర్థలకు మాత్రమే ప్రచారం చేస్తానని, ఎట్టి పరిస్థితుల్లోనూ తాను కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారం చేసేది లేదని.. రెండు పార్టీల మధ్య పొత్తు ఉన్నా కూడా కేవలం సమాజ్వాదీ తరఫున మాత్రమే ప్రచారం చేస్తానని చెప్పారు. దీంతో కాంగ్రెస్ అభ్యర్థులు కొంత షాక్ కు గురయ్యారు. రాహుల్ గాంధీ అన్ని నియోజకవర్గాల్లో తిరిగి ప్రచారం చేయడం సాధ్యం కాదని, కాబట్టి రాష్ట్ర నేతలపై అశలు పెట్టకోగా, ములాయం హ్యాండిచ్చాడని అందోళన చెందారు.
అయితే తన కొడుకు కోసం ములాయం మళ్లీ మనస్సును మార్చుకున్నారు. పొత్తును అంగీకరిస్తూనే.. తాను కాంగ్రెస్ అభ్యర్థుల తరపున కూడా ప్రచారం నిర్వహిస్తానని చెప్పుకోచ్చారు. కాంగ్రెస్ సమాజ్ వాదీ పార్టీల పోత్తతో ఎన్నికల బరిలోకి వెళ్తున్నప్పుడు ఒక పార్టీ అభ్యర్థులకు మాత్రమే ప్రచారం చేస్తానని చెప్పడం భావ్యం కాదన్నారు. అందుకనే కాంగ్రెస్ అభ్యర్థుల తరపున కూడా ప్రచారం చేస్తానన్నారు. ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ కు తన అశీస్సులు వుంటాయని, ఎంతైనా వాడు నా కొడుకు కదా అని మీడియా అడిగిన ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పుకోచ్చారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more