అప్పట్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గవర్నర్ గా ఉన్న సమయంలో ఎన్టీ తివారీ ఏకంగా రాజ్భవన్ను రాసలీలకు కేరాఫ్ అడ్రస్ గా మార్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు అదే హోదాలో మరో వ్యక్తి అలాంటి వ్యవహారాన్నే వెలగబెట్టాడు. ఈశాన్య రాష్ట్రమైన మేఘాలయ గవర్నర్ వీ షణ్ముఖనాథన్ (67) గవర్నర్ కార్యాలయంలో అమ్మాయిలతో రాసలీలలు జరిపిన వ్యవహారం బయటికి రావటం తీవ్ర సంచలనంగా మారింది. దీంతో ఆయన తన పదవికి రాజీనామా చేశారు.
గవర్నర్ కార్యాలయాన్ని ఆయన క్లబ్గా మార్చేశారని, అమ్మాయిలు నేరుగా గవర్నర్ పడక గదికి వెళ్తున్నారని పేర్కొంటూ రాజ్భవన్ సిబ్బంది ప్రధాని మోదీకి లేఖ రాయడం సంచలనం సృష్టించింది. ‘రాజ్భవన్ కు యువతులు యథేచ్ఛగా వచ్చి వెళ్తుంటారు. వారిలో చాలా మంది గవర్నర్ బెడ్రూమ్లోపలి వరకు డైరెక్ట్గా వెళ్తుంటారు. గవర్నర్ ఇద్దరు ప్రజాసంబంధాల అధికారులను, ఒక కుక్ను, రాత్రి విధుల కోసం ఒక నర్స్ను ప్రత్యేకంగా నియమించుకున్నారు. వారంతా మహిళలే. తన దగ్గర విధులు నిర్వహించేందుకు యువతులను మాత్రమే నియమించుకున్నారు. అధికారిక ప్రైవేటు కార్యదర్శిని సైతం తన సెక్రటేరియట్కు బదిలీ చేశారు’ అని ఆ లేఖలో ఉద్యోగులు పేర్కొన్నారు.
అంతేకాదు ఓ మహిళ కూడా షణ్ముగనాథన్పై ఆరోపణలు చేశారు. గతేడాది రాజ్భవన్లోని పీఆర్వో పోస్టుకు దరఖాస్తు చేసుకున్న తనతో గవర్నర్ అసభ్యంగా ప్రవర్తించారని, కౌగలించుకుని ముద్దులు పెట్టుకోబోయారని తెలిపింది. రాజ్భవన్ను అమ్మాయిల కార్యకలాపాలకు వేదికగా మార్చడంతోపాటు తమను మానసిక ఒత్తిడికి, అవమానాలకు గురిచేస్తున్న గవర్నర్ను తక్షణం పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ మొత్తం 98 మంది సిబ్బంది ఫిర్యాదుపై సంతకం చేసి ప్రధానికి పంపించారు.
ఈ ఫిర్యాదును ప్రధానితోపాటు రాష్ట్రపతి, కేంద్రహోంమంత్రి, మేఘాలయ ముఖ్యమంత్రి ముకుల్ సంగ్మాలకు కూడా పంపారు. తొలుత ఈ ఆరోపణలను షణ్ముగనాథన్ ఖండించారు. కొందరు కావాలనే తనపై ఆరోపణలు చేస్తున్నారంటూ కొట్టిపడేశారు. అయితే ఆయనకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తడం, పదవి నుంచి షణ్ముగనాథన్ను తొలగించాలంటూ సివిల్ సొసైటీ విమెన్ ఆర్గనైజేషన్ సంతకాలు చేపట్టడంతో మరోమార్గం లేక షణ్ముగనాథన్ తన పదవికి రాజీనామా సమర్పించారు. తమిళనాడుకు చెందిన షణ్ముఖనాథన్ గతంలో ఆరెస్సెస్ ప్రచారక్గా ఉన్నారు. 2015లో షణ్ముఖనాథన్ మేఘాలయ గవర్నర్గా నియమితులయ్యారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more