కోటి కలలతో అమెరికాలో అడుగుపెడుతున్న భారతీయుల పరిస్థితిని వివరిస్తూ ఓ అమ్మాయి పోస్ట్ చేసిన వీడియో గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. స్వర్గదామం పేరిట వచ్చేవారు అక్కడ అనుభవిస్తున్న కష్టాలంటూ అంతే ఆవేదన భరితంగా అందులో పేర్కొంది. లక్షల రూపాయలు ఖర్చు పెట్టి అమెరికా వెళ్లి విద్యాభ్యాసం చేసి అనంతరం మంచి ఉద్యోగాలు పొందాలనుకునే వారికి పరిస్థితి ఆశాజనకంగా ఏమీ లేదంటూ తేల్చేసింది.
అయితే 48 గంటలు గడవక ముందే ఆ అమ్మాయికి ఝలక్ ఇచ్చాడు ఓ అబ్బాయి. ఆ ఆరోపణలకు కౌంటర్ గా అతగాడు మరో వీడియో పెట్టాడు. అమెరికా అంటే హైదరాబాద్ లోని అమీర్ పేట్ కాదని ఈ అబ్బాయి ఘాటు కౌంటర్ ఇచ్చారు. అమెరికాలో చదువు అనేది మొదలుపెట్టినప్పటి నుంచి ప్రతి ఒక్కరికీ ప్లాన్స్ ఉంటాయని ఈ వీడియోలో విద్యార్థి వివరిస్తూ...20 లక్షలు ఖర్చు పెట్టి వీసా తెచ్చుకుని ఇంటర్వ్యూకెళ్లి అక్కడ క్వాలిఫై అయితేనే అమెరికా వచ్చారని స్పష్టంచేశారు.
ఇండియాలో దోమలున్నట్టే అమెరికాలో బగ్స్ ఉంటాయని వ్యాఖ్యానించారు. అత్యున్నత చదువులు పూర్తి చేసుకున్న వారు తగు విధంగా కొలువులు పొందుతుంటే అలాంటి కెపాసిటీ లేని వారు సర్దుకుపోతున్నారని తెలిపారు. అలా చేసేదాన్ని పాచి పని అంటూ తేలిగ్గా తీసుకోవద్దని ఒకింత ఘాటుగా సూచించారు. ఎవరైనా పార్ట్ టైమ్ ఉద్యోగం చేసి కింది స్థాయి నుంచి పైస్థాయికి వెళ్లాల్సిందేనని తేల్చిచెప్పారు. ఔత్సాహికులు అందరూ అమెరికాకు రావాలని ఇక్కడ లైఫ్ చూడాలని సదరు విద్యార్థి ఆకాంక్షించారు.
ఇదిలాఉండగా మరో యువతి కూడా ఈ వీడియోపై ఘాటుగా స్పందించారు. టైం పాస్ కోసం ఇలాంటి వీడియోలు పెట్టవద్దని కోరుతూ ఈ తరహా పనుల వల్ల విద్యార్థుల్లోనే కాకుండా వారి కుటుంబ సభ్యుల్లోనూ ఆందోళన నెలకొంటుందని తెలిపారు. మొత్తానికి ఆ అమ్మాయి చెప్పినంత దారుణంగా ఏ మాత్రం లేదని, అలా ఉండి ఉంటే చాలా మంది ఇక్కడికి తిరిగి వచ్చేసి ఉండేవారు కూడా అని వ్యాఖ్యానించేవారు లేకపోలేదు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more