కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్ ప్రదేశ్ అధికార పార్టీలో రాజుకున్న వేరు కుంపట్లను చల్లార్చింది. అధికమంది ఎమ్మెల్యేలు మద్దతు వున్న ముఖ్యమంత్రి అఖిలేష్ సింగ్ వర్గానకిి తమ పార్టీ గుర్తు సైకిల్ ను కేటాయించడంతో ఇక చడీచప్పుడూ లేకుండా సమాజ్ వాదీ పార్టీలో వర్గాలన్నీ ఏకమయ్యాయి. దీంతో తండ్రీకొడుకుల మధ్య ఎలాంటి సయోధ్య కుదిరిందో తెలియదు కానీ ఇక అంతా ఒక్కటయ్యే ఐకమత్యేమే మహాబలం అంటూ పాటను అలపిస్తున్నారు. ఈసీ తీసుకన్న నిర్ణయంతో కాసింత వెనక్కు తగ్గిన బాబాయ్ కూడా అఖిలేష్ కు సైకిల్ తోక్కాలని కోరుకున్నాడు. అయితే అఖిలేష్ కూడా తన బాబాయ్ కి సైకిల్ కున్న వెనక సీటును కేటాయించారు.
ఇటీవల పార్టీలో వర్గ పోరు అధికమైనప్పుడు తన సోదరుడు ములాయం సింగ్ తో తమ పార్టీకి చెందిన అభ్యర్థుల జాబితాను శివపాల్ యాదవ్ ప్రకటించారు. అయితే అదంతా ఈసీ ప్రకటన నేపథ్యంలో తుడిచిపెట్టుకుపోయింది. దీంతో అఖిలేష్ తమ పార్టీకి చెందిన 191 మందితో అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేశారు. యులాయం సింగ్ యాదవ్ సూచనమేరకు ఈ జాబితాలో తన బాబాయ్ శివపాల్ యాదవ్కు కూడా స్థానం కల్పించారు. శివపాల్ కోరుకున్న జస్వంత్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచే ఆయనకు స్థానాన్ని ఖారురు చేశారు. ఇక అఖిలేష్ కీలక అనుచరులైన అతుల్ ప్రధాన్, అరవింద్ సింగ్ లాంటి వాళ్లకు కూడా ఈ జాబితాలో స్తానం లభించింది.
అన్ని అనుకూలంగా సాగడం.. బాబాయ్ శివపాల్ యాదవ్కు కూడా చోటు ఇవ్వడంతో తండ్రీ కొడుకుల మధ్య పరిస్థితులు చక్కబడ్డాయని సమాచారం. అసలు శివపాల్ యాదవ్, అమర్సింగ్ ఇద్దరినీ పార్టీ నుంచి పంపేయాలని కూడా ఒక దశలో డిమాండ్ చేసిన అఖిలేష్, ఇప్పుడు తన తొలి జాబితాలోనే బాబాయ్కి టికెట్ ఇవ్వడంతో కుటుంబంలో సామరస్య వాతావరణం ఏర్పడిందన్న సంకేతాలను రాష్ట్ర ప్రజలతో పాటు పార్టీ వర్గాలకు కూడా పంపించారు.
సైకిల్ గుర్తును అఖిలేష్ వర్గానికే కేటాయిస్తూ ఈసీ ఉత్తర్వులు జారీ చేసిన తర్వాత ములాయం 38 మంది అభ్యర్థుల పేర్లతో ఓ జాబితాను కొడుక్కి ఇచ్చారు. వాటిలో శివపాల్ పేరు ఉంది. తండ్రి మాటకు విలువిచ్చిన అఖిలేష్ తన బాబాయ్ కి స్తానం కేటాయించడం కూడా స్వాగతించాల్సని పరిణామమేనని పార్టీ వర్గాలు అంటున్నాయి. ఇదిలా వుండగా, కాంగ్రెస్ పార్టీతో మాత్రమే పొత్తు ఉన్నట్లుగా ఈ జాబితాను బట్టి తెలుస్తోంది. తొలి మూడు దశల్లో ఎన్నికలు జరగనున్న స్థానాలకు సంబంధించి అభ్యర్థులను ఈ జాబితాలో ప్రకటించారు. ఫిబప్రవరి 11 నుంచి ఉత్తరప్రదేశ్లో ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more