దృశ్యం సినిమాను స్పూర్తిగా తీసుకుని హత్య చేశారు తండ్రీ కోడుకులు. ఈ సినిమాలో మాదిరిగా మహారాష్ట్రకు చెందిన తండ్రీకొడుకులు ఓ వడ్డీ వ్యాపారిని చంపేశారు. కాగా సినిమాలో మాదిరిగా చట్టం నుంచి తప్పించుకోలేకపోయారు. చిక్లికి చెందిన వడ్డీ వ్యాపారి శ్రీరామ్ శివాజీ వాలేకర్ నుంచి సమిదుల్లా మనియార్ (54), ఆయన కొడుకు మెహబూబ్ మనియార్ (26) 5 లక్షల రూపాయలను అప్పుగా తీసుకున్నారు. కాగా వీళ్లు సకాలంలో అప్పు తీర్చకపోవడంతో శ్రీరామ్ డిమాండ్ చేశాడు. అప్పు, వడ్డీ కలపి 8.40 లక్షల రూపాయలు బాకీ పడ్డారు.
అప్పు ఎగ్గొట్టేందుకు మనియార్లు దృశ్యం సినిమా తరహాలో శ్రీరామ్ను చంపి సాక్ష్యాలు లేకుండా చేయాలని పథకం వేశారు. గతేడాది సెప్టెంబరులో చిక్లీ ప్రాంతంలో వాళ్లు ఓ అద్దె ఇంటిని తీసుకున్నారు. అదే నెల 27న మాట్లాడేందుకని శ్రీరామ్ను ఈ ప్లాట్కు పిలిచి గొంతు కోసి చంపేశారు. తర్వాత అతని శవాన్ని ఓ ప్లాస్టిక్ షీట్లో చుట్టి ఇంట్లోనే పాతిపెట్టారు. మనియార్లు ఈ విషయం ఇక ఎవరికి తెలియదనుకుని ఏమీ తెలియనట్టు ఉండిపోయారు. కాగా ఆ మరుసటి రోజు అనగా సెప్టెంబర్ 28న శ్రీరామ్ కనిపించడం లేదంటూ ఆయన తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
శ్రీరామ్ ఫోన్ కాల్స్ డేటాను ఆధారంగా అతను మనియార్లతో అప్పు విషయంపై గొడవపడ్డాడని, పలుమార్లు ఫోన్లో మాట్లాడుకున్నట్టు పోలీసులు తెలుసుకున్నారు. మనియార్ ఫోన్ కాల్ డేటాను కూడా పరిశీలించారు. మనియార్ల గురించి పోలీసులు విచారించగా, వాళ్లు సొంతూరుకు వెళ్లినట్టు తెలిసింది. గురువారం మెహబూబ్ చిక్లీ తిరిగి రాగా పోలీసులు వెంటనే కస్టడీలోకి తీసుకుని విచారించగా అసలు విషయం చెప్పాడు. శుక్రవారం హత్య జరిగిన ప్రాంతం నుంచి శ్రీరామ్ మృతదేహాన్ని వెలికితీశారు. పోలీసులు సమిదుల్లాను కూడా అరెస్ట్ చేసి విచారిస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more