క్రీడలంటే అసక్తి వుండటం ఒక్కటే కాదు.. ఆ క్రీడల పట్ల పూర్తిగా నిఫుణుల అథ్వర్యంలో శిక్షణ పోందిన తరువాతే కానీ కాంపిటీషన్ లలో పాల్గొనాలి. అరకోర తర్ఫీదును తీసుకుని పోటీలలో పాల్గోంటే ప్రాణాలకే ముప్పని తమిళనాడులో జరిగిన ఈ ఘటన హెచ్చరిస్తుంది. బాక్సింగ్ కాంపిటీషన్లో పాల్గోన్న ఓ 14ఏళ్ల బాలిక అకస్మిక మరణం చెందింది. బాక్సింక్ రింగ్లో కుప్పకూలిన బాలికను ఆస్పత్రికి తరలిస్తుండగా మృతిచెందింది. ఈ ఘటన తమిళనాడులో ఖేలో ఇండియా బాక్సింగ్ ఈవెంట్లో జరిగింది.
ట్యూటికోరిన్ కు చెందిన మరిశ్వరీ(14) స్థానిక ప్రభుత్వ పాఠశాలలో తొమ్మిదవ తరగతి చదువుతోంది. గత వారం రోజులుగా తన అంకుల్ పర్యవేక్షణలో బాక్సింగ్ శిక్షణ తీసుకుంది. ట్యూటికోరిన్లో జరిగిన ఖేలో ఇండియా బాక్సింగ్ కాంపిటీషన్లో మరిశ్వరీ పాల్గొంది. 14-17 ఏజ్ కేటగిరి ఈవెంట్లు జరుగుతున్నాయి. ఈ క్రమంలో బరిలోకి దిగిన మరిశ్వరీ బాక్సింగ్ రింగ్లో తన ప్రత్యర్థి పంచ్లకు తాళలేక కుప్పకూలిపోయింది.
ఆమెను చికిత్స నిమిత్తం వెంటనే ట్యూటికోరిన్ మెడికల్ కాలేజీ హాస్పిటల్కు తరలించారు. మరిశ్వరీని పరీక్షించిన వైద్యులు అప్పటికే ఆమె చనిపోయినట్లు వెల్లడించారు. అదే ఆస్పత్రిలో పోస్ట్ మార్టం చేయనున్నట్లు అధికారులు చెప్పారు. మరిశ్వరీ చాలా ఆరోగ్యంగా ఉండేదని, ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవని ఆమె కుటుంబసభ్యులు తెలిపారు. 1200 మందికిపైగా విద్యార్థులు ఈవెంట్లో పాల్గొనగా, బాక్సింగ్లో 40 మంది బరిలోకి దిగారు. అయితే తమ కుటుంబంలోనే విషాదం చోటుచేసుకుందని వారు కన్నీటి పర్యంతమయ్యారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more