కేంద్రంలో నరేంద్రమోడీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం పగ్గాలు చేపట్టిన తరువాత.. దేశంలో ఇంధన ధరలు క్రమంగా దిగివచ్చాయి. కానీ రెండున్నరేళ్ల తరువాత మళ్లీ పరిస్థితులలో మార్పులు సంభవిస్తున్నాయి. ప్రస్తుతం ఇంటర్నేషనల్ మార్కెట్లో క్రూడ్ అయిల్ ధరలు భగ్గుమంటున్నాయి. దీంతో ఇవాళ అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో ద్వైమాసికంగా ఇంధన ధరలను సమీక్షించనున్న ఇంధన సంస్థలు ధరలను భారీగా పెంచాలని భావిస్తున్నాయని సమాచారం.
రెండు వారాలుగా అంతర్జాతీయ విపణిలో ముడిచమురు ధరలు 15 శాతం మేర పెరిగిన నేపథ్యంలో.. పెట్రోల్, డీజిల్ ధరలు రూ.6 దాకా పెరిగే ప్రమాదం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. చమురు ఎగుమతి చేసే ఒపెక్ దేశాలతోపాటు రష్యా తదితర దేశాలు కూడా.. 2001 తర్వాత మళ్లీ ఇప్పుడు సరఫరాలను తగ్గించాలని నిర్ణయించడం ధరల పెరుగుదలకు కారణం. ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో చమురు సంస్థలు పెట్రోల్, డీజిల్ ధరలను లీటరుకు ఆరు నుంచి ఏడు రూపాయల దాకా పెంచే అవకాశం కనిపిస్తోంది.
అంతర్జాతీయ మార్కెట్ లో క్రూడ్ అయిల్ ధరలు బ్యారెల్ కు 55 డాలర్లు పలుకుతుండడంలో అందుకు అనుగూణంగా భారత్ లో కూడా ఇంధన ధరలను పెంచాల్సి వస్తుందని.. ఈ క్రమంలో లీటరు పెట్రోల్ పై 7 రూపాయలు, లీటరు డీజిల్ పై అరు రూపాయల మేర ధరలను పెంచేందుకు భారతీయ ఇంధన సంస్థలు సమీక్షిస్తున్నాయి. కాగా కేంద్రంలో మోడీ సర్కారు అధికారంలోకి వచ్చిన తరువాత ఇంత భారీగా ఇంధన ధరలను ఎన్నడూ పెంచలేదు.
ఈ నేపథ్యంలో కేంద్రం ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకోనుందని సమాచారం. మూలిగే నక్కపై తాటికాయ పడినట్లు ఇప్పటికే పెద్ద నోట్ల రద్దుతో చేతిలో డబ్బులు లేక ఇబ్బందులు పడుతున్న ప్రజలను మరింత ఇబ్బందులు పెట్టడం ఇష్టంలేని కేంద్ర ప్రభుత్వం.. క్రూడ్ అయిల్ ధరలు తగ్గిన సమయంలో ఎక్సైజ్ డ్యూటీ పేరుతో అదనంగా విధించిన పన్ను ద్వారా వచ్చిన డబ్బును వినియోగించనుందని తెలస్తుంది. దీంతో పాటు ఇకపై ఎక్సైజ్ సుంకంలో కూడా లీటరుకు మూడు నుంచి నాలుగు రూపాయల మేర కోల్పోయేందుకు సన్నథం అవుతున్నట్లు సమాచారం. లేని పక్షంలో లీటరు పెట్రోల్, డీజిల్ ధరలపై ఏకంగా ఏడు రూపాయల మేర పెంపు తప్పదన్న సంకేతాలు వస్తున్నాయి.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more