ఇక మీదట నాయకులకు వాచిపోతుంది.. కేంద్ర ఎన్నికల కమీషన్ సిఫార్సులను కేంద్ర ప్రభుత్వం అమెదించడమే.. ఆలస్యం.. ఒకవేళ కేంద్రం ఈసీ సిఫార్సులను అమోదిస్తే.. కచ్చితంగా నాయకులకు వాచిపోతుంది. లేదా ఖర్చు పేలిపోతుంది. అదేంటి అంటారా..? ఎన్నికలలో ఖర్చుల వ్యయాన్ని పెంచుతున్నారా అన్న సందేహాలు అవసరం లేదు. ఎందుకంటే ఇటీవలే జరిగిన సార్వత్రిక ఎన్నికలలో భాగంగా అభ్యర్థుల ఖర్చులను సవరించారు. అయితే ఏంటీ మ్యాటర్ అంటారా..?
ఇప్పటి వరకు నాయకులు తమకు పట్టున్న రెండు స్తానాల్లో పోటీకి దిగడం.. ఒక్కోసారి రెండు స్థానాల నుంచి గెలవడం లేదా ఒక్క స్థానంలో గెలుపోందడం మనం చూసిందే. అయితే రెండు వేర్వేరు స్థానాల్లో అభ్యర్థులు పోటీకి పాల్పడటాన్ని ఇకపై రద్దు చేయాలని కేంద్ర ఎన్నికల సంఘం కేంద్రానికి సిఫార్సు చేసింది. ఒక వ్యక్తి ఒకేసారి రెండుస్థానాల్లో పోటీచేసేందుకు వీలు లేకుండా నిషేధం విధించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఈసీ కోరింది.
ఇది కుదరని పక్షంలో కనీసం రెండు స్థానాల్లో గెలిచిన అభ్యర్థి ఒకదానిని ఖాళీ చేసి ఉప ఎన్నికలకు కారణమైతే.. అందుకు అయ్యే వ్యయాన్ని ప్రభుత్వానికి చెల్లించేలా ఆదేశించేలా ఎన్నికల చట్టాల్లో సవరణలు తీసుకురావాలని సూచించింది. దీంతో రెండు స్థానాల్లో గెలిచిన అభ్యర్థికి ఎటు చూసినా జేబులకు చిల్లులు పడటం ఖాయంగా కనిపిస్తుంది. అయితే ఈ రెండింటిలో కేంద్రం ఏ సిఫార్సును అమలుకు అమోదముద్ర వేస్తుందో కూడా వేచి చూడాలి.
ప్రజాప్రాతినిధ్య చట్టం 1951 ప్రకారం ఒక వ్యక్తి సాధారణ ఎన్నికలు లేదా ఉప ఎన్నికలు, లేదా ద్వైవార్షిక ఎన్నికల్లో ఎన్ని స్థానాలకైనా పోటీ చేసే వెసలు బాటు వుంది. అయితే ఈ వెసలుబాటు 1996లో సవరించిన కేంద్రం.. అప్పటి నుంచి ఒక్క అభ్యర్థి కేవలం రెండు స్థానాలకు మాత్రమే పోటీచేసేలా సవరణ చేసింది. అయితే, కేంద్ర న్యాయశాఖకు ఇటీవల ప్రతిపాదించిన ఎన్నికల సంస్కరణల్లో సెక్షన్ 33 (7)ను సవరించి ఒక అభ్యర్థిని ఒకే స్థానంలో పోటీచేసేలా పరిమితి విధించాలని లేని పక్షంలో గెలిచిన అభ్యర్థి ఖాళీ చేసే సీటులో జరిగే ఉప ఎన్నికల వ్యయాన్ని తానే భరించేలా సవరణలు తీసుకురావాలని కోరింది. ఈ వ్యయాన్ని అసెంబ్లీ స్థానానికి రూ. 5 లక్షలుగా, లోక్సభ స్థానానికి రూ. 10 లక్షలుగా ఈసీ ప్రతిపాదించింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more