యూరి ఘటన నేపథ్యంలో భారత్ పై వీలున్న అనివైపుల నుంచి దాడి చేయటం ప్రారంభించింది. ఓ అడుగు ముందుకు వేసి ఉగ్ర మూకను ఏరిపడేసింది కూడా. అదే రీతిలో వీలైనన్నీ మార్గాల్లో పాక్ ను ముప్పుతిప్పలు పెట్టాలని భారత్ యోచిస్తోంది. అందుకే దశాబ్దాల నాటి సింధు జల వనరుల ఒప్పందాన్ని వాడుకుని ఇరకాటంలో పెట్టాలని చూస్తోంది.
అయితే అది సహేతుకమైంది కాదంటున్నారు నర్మదా బచావ్ ఆందోళన్ వ్యవస్థాపక సభ్యురాలు మేధాపాట్కర్. సహజవనరులతో యుద్ధం చేయటం మంచి పద్ధతి కాదని ఆమె అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. నదులు యద్ధ క్షేత్రాలు కాదని, సింధు జలాల ఒప్పందం రద్దుకు తాము వ్యతిరేకమని అన్నారు. సింధు జలాల ఒప్పందం రద్దుకు తాము పూర్తి వ్యతిరేకమని ఆమె పేర్కొన్నారు. ఇండస్ ఒప్పందంలో ఏముంది?
జల యుద్ధాలకు తాము అంగీకరించబోమన్నారు. నదులు యుద్ధ క్షేత్రాలు కాదని, వాటిని రాజకీయాలకు ఉపయోగించుకోవద్దని సూచించారు. నిజానికి దేశ అవసరాల కోసమే ప్రాజెక్టులు నిర్మిస్తున్నట్టు ప్రభుత్వాలు చెబుతుంటాయని, కానీ నిజానికి వాటి వల్ల బాగుపడేది మాత్రం వ్యాపార వర్గాలేనని ఆరోపించారు. చిన్నచిన్న డ్యాముల నిర్మాణం వల్లే పేదలకు, పర్యావరణానికి మేలు జరుగుతుందని ఆమె పేర్కొన్నారు.
మహారాష్ట్రకు చెందిన 61 ఏళ్ల మేధా పాట్కర్ ఎంఏలో సోషల్ వర్క్ కోర్సు చేశారు. మధ్యప్రదేశ్, గుజరాత్ తదితర ప్రాంతాల్లో గిరిజన హక్కుల కోసం పోరాడుతున్న సామాజిక వేత్త. గుజరాత్ లోని సర్దార్ సరోవర్ నిర్మాణానికి వ్యతిరేకంగా, భారీ డ్యామ్ లు వారి(గిరిజన) జీవన విధానానికి ఆటంకాలుగా ఉన్నాయంటూ నర్మదా బచావో ఆందోళన్ అనే సామాజిక ఉద్యమానికి తెరలేపాపి పోరాడుతున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more