కేంద్రంలో బీజేపి నేతృత్వంలోని నరేంద్రమోడీ సర్కార్ కొలువుదీరిన సుమారు రెండున్నరేళ్లకు ఎన్డీయే ప్రభుత్వానికి పెద్ద జలక్ తగిలింది. నరేంద్రమోడీ సర్కార్కు తొలిసారిగా రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ జలక్ ఇచ్చారు. పార్లమెంటు ద్వారా కాకుండా రాష్ట్రపతి ప్రత్యేక అధికారాలను వినియోగింది.. అర్డినెన్సుల పాలనను సాగించడంపై అయన అక్షేపించారు. ఇప్పటికే పలు దఫాలుగా అర్డినెన్సులపై సంతకాలు చేసిన రాష్ట్రపతి ప్రణబ్.. తాజాగా కేంద్ర ప్రభుత్వం పంపిన మరో అర్డినెన్స్ పై సంతకాన్ని చేసి. దానితో పాటుగా ఒక నోట్ ను కూడా పంపారు.
ప్రజాస్వామ్య వ్యవస్థలో పార్లమెంటులో బిల్లలను అమోదం చేసుకుని వాటిని వినియోగంలోకి తీసుకురావాలని అయన పేర్కోన్నారు. దానికి బదులు పార్లమెంటులో అమోదం పొందని బిల్లులను ఇలా అర్డినెన్సుల రూపంతో తీసుకురావడాన్ని అయన ఆక్షేపించారు. ఎన్డీయే సర్కారు ఒత్తిడితో ఇప్పటికే నాలుగుసార్లు ఆర్డినెన్స్ లపై సంతకాలు పెట్టిన ఆయన, మరోసారి ఇలా చేయవద్దని ప్రధాని నరేంద్ర మోదీకి నోట్ రాసి పంపినట్టు తెలుస్తోంది. ప్రజా ప్రయోజనాల కోసం కొన్నిసార్లు ఆర్డినెన్స్ లు తేవడం మంచిదే అయినప్పటికీ, ప్రతీసారి ఇలా చేయడం సహేతుకం కాదని చెప్పినట్లు సమాచారం.
తాజా ఆర్డినెన్స్ లో 48 సంవత్సరాల నాటి ఎనిమీ ప్రాపర్టీ చట్టానికి సవరణలు చేస్తూ, రూల్ 12ను వాడుకుంటూ, క్యాబినెట్ ఆమోదం లేకుండానే ఆర్డినెన్స్ పై సంతకం కోసం రాష్ట్రపతి వద్దకు దాన్ని పంపారు ప్రధాని. యుద్ధాల తరువాత పాకిస్థాన్ లేదా చైనాకు వలస వెళ్లిన వారి ఆస్తులకు సంబంధించిన నిబంధనలను ఈ ఆర్డినెన్స్ సవరిస్తోంది. ఈ సంవత్సరం ఆరంభంలో లోక్ సభలో పాసైన చట్ట సవరణ బిల్లు, రాజ్యసభలో మాత్రం ఆగిపోయింది. దీన్ని ఆర్డినెన్స్ గా తీసుకువచ్చి అమలు చేయాలని మోదీ సర్కారు గతంలోనే నిర్ణయించింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more