తెలంగాణ ప్రభుత్వం 70వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను గోల్కొండ కోటలో ఘనంగా నిర్వహించింది. తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన ప్రజలందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక మూడోసారి వేడుకలను కూడా గోల్కొండలోనే జరుపుకుంటున్నందుకు ఆనందంగా ఉందన్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ అన్ని రంగాల్లో రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళుతున్నామన్నారు.
బీసీలు, ఈబీసీలకు కల్యాణలక్ష్మి పథకం వర్తింపు చేస్తున్నట్లు చెప్పారు. సంక్షేమ రంగంలో దేశంలోనే తెలంగాణ నెంబర్ వన్ స్థానంలో ఉందని కేసీఆర్ పేర్కొన్నారు. పోరుగు రాష్ట్రాలతో సంబంధాలను చక్కగా ఏర్పర్చుకోవడంతో రాష్ట్రానికి ఎదురైన పలు సమస్యలను కూడా చక్కబెట్టుకోగలిగామన్నారు. ముఖ్యంగా విద్యత్ సమస్యను ఆయన ప్రస్తావించారు. ప్రధాని నరేంద్రమోడీ చేతుల మీదుగా మిషన్ భగీరధ పథకాన్ని ప్రారంభించడంతో పాటు.. ధర్మల్ విద్యుత్ పవర్ ప్లాంట్ కూడా శంఖుస్థాపని చేశామని వాటిని పూర్తి వినియోగంలోకి తీసుకురావచ్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని అన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రధాని కృషిని కూడా ప్రశంసించారు
కేజీ నుంచి పీజీ వరకూ ఉచిత విద్యకు శ్రీకారం చుట్టినట్లు చెప్పారు. నాలుగు నెలల్లో ఛత్తీస్గఢ్ నుంచి వెయ్యి మెగావాట్ల విద్యుత్ను పొందుతామన్నారు. పేద బ్రాహ్మణులకు బడ్జెట్లో వందకోట్లు కేటాయించినట్లు చెప్పారు. దసరా పండుగకు కొత్త జిల్లాల ఏర్పాటు ఉంటుందన్నారు. చిన్న, సన్నకారు రైతులకు 100 శాతం సబ్సిడీ, ఎస్టీ, మైనార్టీలకు త్వరలో 12శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామన్నారు. 2019నాటికి మిషన్ భగీరథ ద్వారా ప్రతి ఇంటికి తాగు నీరు అందిస్తామన్నారు. ఈ ఏడాది ప్రభుత్వ పరిధిలో లక్ష ఉద్యోగాల భర్తీ చేస్తామన్నారు. 2303 పరిశ్రమల ద్వారా రాష్ట్రానికి రూ.46వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయన్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more