సులభంగా డబ్బును అర్జించేందుకు పవిత్రమైన ఏడు అడుగుల బంధాన్ని కూడా వాడుకుని ఏడుగురితో వివాహం చేసుకుని ఎనమిదో పెళ్లికి సిద్దమైన ఓ కిలాడి వన్నెలాడినే తాను పరిణయం అడుతానని భీష్మించాడు ఓ వ్యాపారి. ఏడుగురితో వివాహం చేసుకుని వారి నుంచి డబ్బు, నగలు, విలువైన ఆభరాలను తీసుకుని ఉడాయించిన మాయలాడి పవిత్రతోనే తన వివాహం జరపించాలని 43 ఏళ్ల స్థానిక వ్యాపారి, ఎనమిదో పెళ్లి కోడుకు కనకరాజ్ పట్టుబట్టడంతో పోలీసులు అవాక్కయ్యారు. ఇటీవలే పవిత్ర అలియాస్ మాలతితో ఉడుమలైపేటలో నిశ్చితార్థం కూడా జరిగడంతో అమెతోనే తన వివాహం జరిపించాలని పట్టుబడుతున్నాడట.
నిశ్చితార్థ సమయంలో పవిత్రకు ఖరీదైన పట్టుచీర, 20 సవర్ల నగలను పెళ్లి కానుకగా ఇచ్చిన కనకరాజ్ అమెపై మనసు పారేసుకున్నాడు, అమెపై ఎన్ని కేసులు వున్నా పర్వాలేదు.. అమెను తాను పెళ్లి చేసుకుంటానని చెబుతున్నాడట. తనకు ఆమెతో పెళ్లి అయితే చాలు అని కూల్గా చెప్పాడు. ఆమెను తనతో పంపమని పోలీసులను బతిమాలాడు. దీంతో పోలీసులు ముందుగా అతన్ని సముదాయించినా అతను తన పట్టు వీడకపోవంతో ఇక తప్పనిసరి పరిస్థితుల్లో అతన్ని హెచ్చరించారు.
పవిత్ర ఎలా పట్టుబడింది..?
ఒకరి తరువాత ఒకరిని పెళ్లి చేసుకుని డబ్బు నగలు, నగదు, విలువైన వస్తువులతో ఉడాయించే పవిత్ర ఇప్పటికే ఏడుగురిని పెళ్లి చేసుకుంది. కాగా తిరుపూర్ జిల్లా తారాపురం సమీపంలోని కోణప్పన్ సాలై గ్రామానికి చెందిన సెల్వకుమార్ (పవిత్ర ఏడో భర్త) తన భార్య పవిత్ర (32) గత నెల 27 నుంచి కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో పవిత్రను ఉడుమలైలో పోలీసులు పట్టుకున్నారు. విచారణలో బ్రోకర్ల సాయంతో ఆమె ఏడుగురిని వివాహం చేసుకుని వారితో కొన్ని రోజులు గడిపి నగలు, నగదు దోచుకుని పారిపోయేదని తెలిసింది.
బ్రోకర్లు పెళ్లి కొడుకుల వద్ద పవిత్రకు తల్లిదండ్రులు లేదని ఆమెను పెంచుకున్న వారికి రూ.3 లక్షలు ఇవ్వాలని చెప్పేవారు. లేటు వయస్సులో అమ్మాయిలు దోరక్క ఇబ్బందిపడే పెళ్లి కొడుకులు బ్రోకర్ల కండీషన్లకు తలొగ్గి పవిత్రను పరిణయమాడారు. వారితో కొన్న రోజులు కాపురం చేసి.. అదను చూసి నగలు, నగదు విలువైన వస్తువులతో అక్కడి నుంచి ఉడాయించేది. కాగా పవిత్ర మోసానికి మొదటి భర్త సహకరించేవాడని తెలిసింది. దీంతో అతడ్ని కూడా అదుపులోకి తీసుకని పోలీసులు విచారించారు.
ఇలా సేకరించిన మొత్తంలో పవిత్ర బ్రోకర్లకు కొంత మొత్తం ముట్టజెప్పేదని.. దీనికి ఆశపడిన బ్రోకర్లు పెళ్లికొడుకుల కోసం గాలించేవారని తెలుస్తోంది. కొంతమంది బ్రోకర్లు పెళ్లి కొడుకుల జాతకాలకు తగినట్లు పవిత్ర జాతకాన్ని తయారు చేసి మోసానికి పాల్పడినట్లు తెలిసింది. అయితే మోసపోయిన వారు ఎవరూ ఆమెపై ఫిర్యాదులు చేయడానికి ముందుకు రాలేదు. దీంతో పోలీసులు ఏడో భర్త సెల్వకుమార్ వద్ద చోరీ చేసిన నగలు, నగదును అతనికి ఇప్పించి పవిత్రను హెచ్చరించి వదిలేశారు.
మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more