ఇప్పటికే పలు వివాదాలు, కోర్టు కోసులలో ఇరుక్కుని తన ముఖ్యమంత్రి పదవిని కూడా పోగొట్టకుని అవినీతి, అక్రమాలకు పాల్పడినట్లుగా అరోఫణలు ఎదుర్కోంటున్న కర్ణాటక బీజేపీ అధ్యక్షుడు, మాజీ సీఎం యడ్యూరప్ప.. తాజాగా మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. హసన్ జిల్లాలోని అర్సికెరేలో జరిగిన ఒక మైనార్టీ వర్గానికి చెందిన విద్యార్థి హత్య కేసు విషయమై ఆ జిల్లా ఎస్పీని యడ్యూరప్ప ఫోన్లో బెదిరించారని వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే అధికార కాంగ్రెస్ పార్టీ యడ్యూరప్ప చర్యలను తీవ్రంగా పరిగణిస్తుంది.
కాగా రాష్ట్ర కాంగ్రెస్ అధికార ప్రతినిధి బ్రిజేశ్ కాలప్ప తన ఫేస్ బుక్ అకౌంట్ ద్వారా ఇందుకు సంబంధించిన వీడియోను కూడా విడుదల చేసి.. ఈ కేసులో యడ్యూరప్ప పోలీసు బాస్ లపైనే ఒత్తడి తీసుకువస్తున్నారని ఆరోపించారు. ఇందుకు సాక్ష్యం తాను అప్ లోడ్ చేసిన వీడియోనేనని కూడా చెబుతున్నారు. ఆ హత్య కేసులో మీరు పలువురు హిందూ యువకులను అరెస్ట్ చేశారు. మరికొందరిని చిత్రహింసలు పెడుతున్నారు. ఇకపై ఇలాంటి పనులు చేయకపోతే మంచిది. లేకుంటే అర్సికెరేలో శాంతిభద్రతలు దెబ్బతింటాయి అని ఎస్పీ రాహుల్ కుమార్ను యడ్యూరప్ప హెచ్చరిస్తున్న దృశ్యాలు ఆ వీడియోలో ఉన్నాయి.
యడ్యూరప్ప తన పలుకుబడిని ఉపయోగించి ఈ విధంగా హత్య కేసు దర్యాప్తును నీరుగార్చాలని చూస్తున్నారని కాలప్ప అన్నారు.. గత మే 29 న ఇమ్మానుయెల్ వరుణ్ అనే 24ఏండ్ల యువకుడిని కొందరు కత్తులతో పొడిచి చంపడంతో అర్సికెరేలో హింసచెలరేగింది. ఆ ప్రాంతంలో షాపులపై దాడి జరిగింది. హత్యకు సంబంధించి 11 మందిని, హింసాకాండకు సంబంధించి 13మందిని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసినవారిలో కొందరు హిందూ గ్రూపులకు చెందినవారుండటంతో యడ్యూరప్ప కలుగజేసుకున్నారు.
మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more