హైదరాబాద్ మహానగరంలో ఎలాంటి అలజడి సృష్టించాలని యత్నిస్తున్న వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి అందిన అదేశాల మేరకు హైదరాబాద్ పోలీసులకు కమీషనర్ మహేందర్ రెడ్డి సూచనల మేరకు పోలీసులు అర్థరాత్రి అలజడి చేసేవారిని తమ అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఇంతకీ వీరు చేస్తున్న అలజడి ఏంటా అనేగా..? మీ సందేహాలు. అర్ధరాత్రి బైక్ రేసింగ్లకు పాల్పడుతూ.. అదే సమయంలో తమ పక్కగా వెళ్లేవారిని భయాందోళన కలిగేలా చేస్తున్న యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
అర్థరాత్రి సమయంలో పలువురు సంపన్నవర్గాలకు చెందిన సంతానం బైక్ రేసింగ్ లకు పాల్పడుతుంది. సమాచారం అందుకున్న పోలీసులు యువకుల బైక్ రేసింగ్ కు చెక్ పెట్టారు. శనివారం అర్ధరాత్రి పలువురు యువకులు జూబ్లిహిల్స్ చెక్ పోస్ట్ ప్రాంతంలో రేసింగ్లు నిర్వహిస్తున్నారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు దాడులకు దిగారు. 25 మంది యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం 25 బైక్లను పోలీసులు స్వాధీనం చేసుకుని... సీజ్ చేశారు. ఆ తర్వాత వారిని పోలీస్ స్టేషన్కి తరలించారు. సదరు యువకులు తల్లిదండ్రులను స్టేషన్కి పిలిపించి... వారి... సమక్షంలో యువకులకు కౌన్సిలింగ్ ఇస్తున్నారు.
కాగా, ఇటీవల చోటుచేసుకుని సంచలనం రేపిన దేవి, భరత్ సింహరెడ్డిల కారు ప్రమాదం నేపథ్యంలో పోలీసులు నగరంలో అక్రమంగా నిర్వహిస్తున్న పబ్ లపై కూడా దాడులు జరిపారు. తెల్లవారు జాము వరకు అక్రమంగా మద్యాన్ని విక్రయిస్తున్నవారిపై కోరడా ఝుళిపించారు. నగరంలోని జూబ్లిహిల్స్, బంజారాహిల్స్ ప్రాంతాల్లో పలు హుక్కా సెంటర్లు, పబ్లలో పోలీసులు శనివారం రాత్రి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న 16 హుక్కాసెంటర్లు, 3 పబ్లను పోలీసులు సీజ్ చేశారు. వాటిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.
మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more