ఆలయాల్లోకి మహిళలు ప్రవేశించవచ్చంటూ ఇచ్చిన కోర్టు తీర్పులు సరైనవి కావని పరిపూర్ణానంద స్వామి విమర్శించారు. సనాతన ధర్మాలను, ఆచారాలను దృష్టిలో పెట్టుకుని దేశంలోని పలు ఆలయాల్లోకి మహిళలను అనుమతించడం లేదు తప్ప.. మిగతా అన్ని ఆలయాల్లోకి మహిళలు వెళ్తున్నారని ఆయన చెప్పారు. అయితే ఆలయ విశిష్టలతకు భంగం రాకుండా, సనాతన ధర్మాలను, ఆచారాలను పరిరక్షించే అనాధిగా మహిళలను ఆలయ ప్రవేశానికి దూరంగా వుంచుతున్నారని అయన అభిప్రాయపడ్డారు.
అయితే ఇలాంటి ఆలయాల్లోకి కూడా మహిళలకు అనుమతించాలంటూ, వారి ఆలయ ప్రవేశాన్ని అడ్డుకోకూడదని న్యాయస్థానాలు తీర్పు ఇచ్చేముందు కొన్ని విషయాలను పరిగణలోకి తీసుకోవాలని అన్నారు. అన్ని అంశాలను న్యాయబద్దంగా కాకుండా ధార్మికంగా కూడా విశ్లేషించుకుని నిర్ణయం తీసుకోవాల్సి వుంటుందన్నారు. న్యాయస్థానాలు తీర్పులను వెలువరించే ముందు హిందూ ధార్మికవేత్తలతో ఒక కమిటీ వేయాలని ఆయన సూచించారు. మసీదుల్లోకి మహిళలను అనుమతించాలంటే న్యాయ స్థానాలు స్పందిస్తాయా? అని ఆయన ప్రశ్నించారు.
అయితే హిందూ మతంలో పురుష హిందువు, మహిళా హిందువు అన్న భేదమే లేదు. హిందువు అంటే హిందువేనంటూ ఈ ప్రజావాజ్యాం విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. కేరళలోని ప్రముఖ దేవాలయం శబరిమలలో మహిళల ప్రవేశంపై శతాబ్దాలుగా ఉన్న నిషేధం ఎత్తివేత అంశంపై సర్వోన్నత న్యాయస్థానం విచారణ జరిపింది. హిందూ మతంలో స్త్రీ-పురుష భేదం లేదని, హిందువులంతా హిందువులేనని ఈ సందర్భంగా జడ్జిలు వ్యాఖ్యానించారు. దేవాలయాల్లోకి మహిళల రాకను అడ్డుకోవడమంటే రాజ్యాంగం వారికి ఇచ్చిన సమానత్వ హక్కును ఉల్లంఘించడమేనని వారు స్పష్టం చేశారు.
అయితే శబరిమలలోకి మహిళల రాకను నిషేధించే సంప్రదాయాన్ని కొనసాగించాల్సిందేనని ఆలయ ట్రస్టు, కేరళ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు నివేదించాయి. శబరిమలలో కొలువైన అయ్యప్ప బ్రహ్మచారి అని, పిల్లలకు జన్మనిచ్చే మహిళల రాక వల్ల ఆలయ పవిత్రతకు భంగం వాటిల్లవచ్చునని పేర్కొన్నాయి. సనాతన ఆచారాలు, సంప్రదాయాల ఆధారంగా చేసే వాదన రాజ్యాంగం కల్పించిన హక్కుల ముందు నిలబడే ఆస్కారంలేదని సుప్రీంకోర్టు ఈ సందర్భంగా పేర్కొంది.
మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more