చర్చి పాస్టర్ గా కొనసాగుతూ.. ప్రవిత్రమైన స్థలంలో ఓ చిన్నారి బాలికై పదే పదే అత్యాచారం చేసిన కామాంధుడికి న్యాయస్థానం నలభై ఏళ్ల పాటు జైలు శిక్ష విదించింది. సాధారణంగా జీవిత ఖైదు పడిన దోషులకే 14 ఏళ్ల జైలు శిక్ష పడుతుండగా, ఈ కేసులో దోషికి మాత్రం 40 ఏళ్ల శిక్ష విధించడం సంచలనంగా మారింది. మత ప్రబోధకుడిగా నలుగురికి మంచి మాటాలు చెప్పుతూ, అందరినీ సన్మార్గంలో నడిపించాల్సిన వ్యక్తే, పవిత్రమైన ప్రార్థనామందిరంలో చేయకూడని పనిని పదే పదే చేసి, 12 ఏళ్ల చిన్నారిపై పైశాచిక మృగంలా తెగబడటాన్ని తీవ్రంగా పరిగణించిన న్యాయస్థానం ఆ కామాంధ మృగానికి 40 ఏళ్ల పాటు జైలు శిక్షను విధించింది.
ప్రత్యేక ప్రాసిక్యూటర్ పియూస్ మాథ్యూవ్ తెలిపిన వివరాల ప్రకారం.. కేరళ తిస్సుర్ లోని సాల్వేషన్ ఆర్మీ చర్చిలో సానిల్ కె జేమ్స్ అనే 37 ఏళ్ల వ్యక్తి పాస్టర్ గా విధులు నిర్వహిస్తున్నాడు. అయితే 2014లో చర్చికి వచ్చే ఓ చిన్నారి 12 బాలికపై అతడు కామవాంఛ తీర్చుకున్నాడు. అయితే అదే తప్పుకు పదే పదే పాల్పడ్డాడు. దీంతో ఆగ్రహించిన న్యాయస్థానం సమాజాన్ని సన్మార్గంలో నడిపించాల్సిన స్థానంలో వున్న వ్యక్తి అత్యంత దారుణమైన చర్యలకు పాల్పడిన నేపథ్యంలో వారికి అత్యంత కఠినమైన శిక్ష పడాలని అభిప్రాయపడిందని చెప్పారు.
అందుకనే ఈ కేసులో దోషిగా నిర్థారణ అయిన వ్యక్తికి సాధరణంగా జీవిత ఖైదు కన్నా అధిక కాలం శిక్షను విధించిందని తెలిపారు. ఈ కేసులో చిన్నారులపై అత్యాచారాల నిరోధక చట్టంతో పాటు చిన్నారులపై లైంగిక వేధింపులకు పాల్పడిన రెండు చట్టాల కింది రెండు 20 ఏళ్ల శిక్షలను విధించిన న్యాయస్థానం, దీంతో పాటు 20 వేల జరిమానా కూడా విధించింది. కాగా సదరు పాస్టర్ మరో 13 ఏళ్ల చిన్నారిపై కూడా అత్యాచారానికి పాల్పడ్డాడని అరోపణలపై నమోదైన కేసులో విచారణ కొనసాగుతందన్నారు. న్యాయస్థానం తీర్పుపై కేరళ మహిళా సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి.
జి మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more