ఢిల్లీ అండ్ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ (డీడీసీఏ) వ్యవహారం బీజేపీ, ఆమ్ ఆద్మీ పార్టీల మధ్యే కాకుండా... అంతర్గతంగా బీజేపీలో కూడా చిచ్చు రేపింది. డీడీసీఏ నిధుల దుర్వినియోగంలో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ పాత్ర ఉందని బీజేపీ ఎంపీ, మాజీ క్రికెటర్ కీర్తి అజాద్ ఆరోపించిన నేపథ్యంలో, ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ఈ తరుణలో తనను పార్టీ నుంచి సస్సెండ్ చేయడానికి గల కారణాలను తెలిపాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. తాను డీడిసీఏ విషయంలో.. జరిగిన అవకతవకల విషయంలో అవినీతిపరులపై ఆరోపణలు చేశానే తప్ప.. పార్టీకి వ్యతిరేకంగా ఎలాంటి తప్పను చేయలేదని, అయినా తనను పార్టీ నుంచి ఎందుకు సస్పెండ్ చేశారని కీర్తీ అజాద్ డిమాండ్ చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో, ప్రధాని మోదీ అపాయింట్ మెంట్ ను అజాద్ కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 1996 ఎన్నికల సమయంలో తాను మోదీని కలిశానని... అప్పట్లో ఆయన జనరల్ సెక్రటరీగా ఉన్నారని తెలిపారు. అప్పట్లో మోదీతో తనకు మంచి సంబంధాలు ఉన్నాయని కూడా తెలిపారు. అయితే ప్రస్తుతం తన విషయంలో జరిగిన అన్యాయాన్ని మోడీ సరిదిద్దుతారని, తన అభ్యర్థనను విని, తనకు ఆయన న్యాయం చేస్తారనే భావిస్తున్నానని చెప్పారు. కీర్తి అజాద్ ను పార్టీ నుంచి సస్పెండ్ చేయడం పట్ల పార్టీ సీనియర్లు కూడా కొంత అసంతృప్తిగానే ఉన్నారు. కాగా తనకు పార్టీ పంపిన నోటీసుకు ఆయన సమాధానాన్ని ఇచ్చే విషయంలో తన మిత్రుడు సుబ్రహ్మణ్యస్వామి తనకు సాయం చేస్తున్నారని తెలిపాడు
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more