పార్లమెంటులో ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ కూడా అబద్ధాలు ఆడారని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు. తన సొంత కార్యాలయంలో ఫైళ్లను చూస్తున్నారని, తనకు వ్యతిరేకంగా సాక్ష్యాలు సంపాదించేందుకే ఇలా చేస్తున్నారని ట్వీట్ చేశారు. రాజేంద్ర కుమార్ అంశాన్ని సాకుగా పెట్టుకుని కేంద్రం.. తన అధికార దర్పంతో తన కార్యాలయంపై సిబిఐ సోదాలు జరిపిందని ఆయన దుయ్యబట్టారు. ప్రస్తుత ముఖ్యమంత్రుల్లో తన క్యాబినెట్ లోని ఓ మంత్రితో పాటు ఒక సీనియర్ అధికారిని కూడా అవినీతి అరోపణల నేపధ్యంతో తాను సస్పెండ్ చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.
ఇలా దేశంలో ఏ ముక్యమంత్ర చేయలేదన్ని చెప్పుకోచ్చారు. నిజంగా రాజేంద్ర కుమార్ కార్యాలయంపై దాడి చేయాలనుకున్న నేపథ్యంలో తనకు సిబిఐ ఎందుకు షేర్ చేసుకునేది కాదని ఆయన నిలదీశారు. కేంద్ర మంత్రులు అరుణ్ జైట్లీ, వెంకయ్యనాయుడులు అబద్దాలను చెబుతున్నారని ఆయన అరోపించారు. తన చాంబర్ లోనే పలు దస్త్రాలను పరిశీలించారని వెల్లడించిన కేజ్రీవాల్, ఇదంతా ప్రధాని నరేంద్ర మోదీ పథకం ప్రకారమే జరిగిందని ఆరోపించారు. ప్రధానికి ఏ ఫైల్ కావాలో చెబితే, తానే స్వయంగా వెళ్లి ఇస్తానని అన్నారు. రాజకీయ కుట్రలు జరుపుతూ, సీబీఐని ఉసిగొల్పడమేంటని ప్రశ్నించారు.
ఇక సీఎం కార్యాలయాన్ని సీజ్ చేయడంపై తాను షాక్ తిన్నానని, ఇలాంటిది ఇంతకు ముందెప్పుడూ లేదని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అరవింద్ కేజ్రీవాల్కు మద్దతుగా ట్వీట్ చేయగా, దానికి సమాధానం ఇస్తూ.. ఇది అప్రకటిత ఎమర్జెన్సీలా ఉందని కేజ్రీ అన్నారు. ఒకవేళ రాజేంద్రకుమార్ తన కార్యదర్శి కాకపోతే ఈ దాడులు జరిగేవా అని ప్రశ్నించి.. జరిగేవి కాదని తానే సమాధానం ఇచ్చారు. అప్పుడు టార్గెట్ ఎవరు.. రాజేందరా తానా అని మరో ప్రశ్న సంధించారు. 2002 సంవత్సరంలో షీలా దీక్షిత్ అవినీతి వ్యవహారం జరిగితే 2015లో కేజ్రీవాల్ మీద సీబీఐ దాడులు జరిగాయని.. 'వహ్.. మోదీజీ' అని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more