కుమారి 21 ఎఫ్’ మూవీ చిక్కుల్లో పడిందా? ఇందులో మహిళలను కించపరిచేలా సన్నివేశాలున్నాయా అంటే అవుననే అంటున్నారు సామాజిక కార్యకర్త శ్రీనివాస్. ఈ మేరకు ఆయన మానవ హక్కుల కమీషన్ (హెచ్ఆర్సీ)లో ఫిర్యాదు చేశారు. మహిళల పట్ల అసభ్యకర తీరుతో తీసిని ఈ సినిమాను తక్షణం నిషేధించి.. నిర్మాత సుకుమార్, డైరెక్టర్ సూర్య ప్రతాప్, హీరో రాజ్ తరుణ్లపై కేసులు నమోదు చేయాలని ఆయన తన పిటీషన్ లో పేర్కొన్నారు.
శ్రీనివాస్ దాఖలు చేసిన పిటీషన్ ను విచారించిన మానవ హక్కుల కమీషన్, ఫిబ్రవరిలోగా ఈ చిత్రంపై మోపబడ్డ అభియోగాలపై నివేదిక ఇవ్వాలని హైదరాబాద్ పోలీసు కమిషనర్ను ఆదేశించింది. టాలీవుడ్లో తక్కువ బడ్జెట్తో తెరకెక్కించిన ఈ సినిమా రీసెంట్గా విడుదలైంది. డైరెక్టర్ సుకుమార్ నిర్మాతగా మారిన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద కాసులను బాగానే రాబట్టింది. విడుదలైన అన్ని సెంటర్స్లోనూ హౌస్ఫుల్ కలెక్షన్లతో నడుస్తోంది. మరి హెచ్ఆర్సీకి పిర్యాదు నేపథ్యంలో ఈ చిత్రం ఎలా నిలదోక్కకుంటుందో వేచి చూడాలి.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more