Encounter in Vishaka agency in the late night

Encounter in vishaka agency in the late night

Police, Vishaka, Maoists, naxals, Ap, Odisha, Encounter

Police encountered Maoists in the Vishaka Agency area in the late night. By the intelligence information police entered into the forest and found maoists. Maoists open fire on police.

ITEMVIDEOS: విశాఖ ఏజెన్సీలో ఎన్ కౌంటర్

Posted: 12/11/2015 11:43 AM IST
Encounter in vishaka agency in the late night

విశాఖ ఏజెన్సీలో మరోసారి మావోలు, పోలీసులకు కాల్పులు జరిగాయి. మరోసాని ఎన్ కౌంటర్ కలకలం రేగడంతో ఏపి, ఒడిశా, తెలంగాణ, చత్తీస్ ఘడ్ లలో పోలీసులు అలర్ట్ అయ్యారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో తీవ్ర కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. విశాఖ జిల్లా అరకు మండలం గన్నెల అటవీప్రాంతంలో ఈ ఎన్ కౌంటర్ జరిగినట్టు తెలుస్తోంది. పోలీసులు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు జరిగినట్టు సమాచారం. ఈ కాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందినట్టు తెలుస్తున్నా, పోలీసులు ఇంకా ధృవీకరించలేదు. నిన్న రాత్రి సుమారు 11 గంటల నుంచి 2గంటల వరకు కాల్పులు జరిగినట్టు తెలుస్తోంది.



Also Read: తెలంగాణలో మళ్లీ నక్సల్స్ కదలికలు..!

చాలా కాలం తర్వాత విశాఖ జిల్లాలో మావోయిస్టుల సంచారం, ఎన్ కౌంటర్ చోటు చేసుకోవడం కలకలం రేపుతోంది. మరోవైపు రెండు రోజుల క్రితం ఛత్తీస్ గడ్ లో 15మంది మావోయిస్టులు చనిపోయారని పోలీసులు చెప్పినా, ఒక డెడ్ బాడీని కూడా రికవరీ చేయలేకపోయారు. ఈ నేపథ్యంలో అరకులో చోటు చేసుకున్న ఎన్ కౌంటర్ లో ఇద్దరు మావోయిస్టులు చనిపోయినట్లు తెలుస్తోంది.  అయితే మావోయిస్టులు నిర్వహిస్తున్న వారోత్సవాల ముగింపు సందర్భంగా ఓ మీటింగ్ ను ఏర్పాటు చెయ్యగా. సమాచారం అందుకున్న పోలీసులు వారి మీద దాడికి పాల్పడినట్లు సమాచారం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Police  Vishaka  Maoists  naxals  Ap  Odisha  Encounter  

Other Articles