పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పి స్నేహితునితో కలసి ప్రేమించిన యువతిని నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లి సామూహిక అత్యాచారానికి తెగపడ్డారు మగమృగాళ్లు. ప్రేమ ముసుగులో జరిగే ఇలాంటి దారుణాలు అనేకం. కాగా కొందరు మాత్రమే ధైర్యంగా పోలీసులను ఆశ్రయించి పిర్యాదు చేస్తున్నారు. తాజాగా ప్రేమ పేరుతో మోసపోయిన యువతి బళ్లారి జిల్లా కూడ్లిగి తాలూకా కొట్టూరు పోలీస్ స్టేషన్లో పిర్యాదు చేసింది. తనను ప్రేమ పేరుతో మోసగించి.. అత్యాచారానికి పాల్పడిన ఓ నయవంచకుడు, అతని మిత్రుడిపై చర్యలు తీసుకోవాలని బాధితురాలు పిర్యాదులో పేర్కోంది.
తనపై అత్యాచారం చేసి... ఆ దృశ్యాలను మొబైల్లో చిత్రీకరించి తనను వేధిస్తున్నారని బాధితురాలు ఫిర్యాదు పేర్కోంది. పోలీసుల కథనం ప్రకారం... కొట్టూరు పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ క్యాంపునకు చెందిన 18 ఏళ్ల పీయూసీ విద్యార్థినిని అదే క్యాంపునకు చెందిన ఏ రమేష్ (21) అనే యువకుడు సదరు యువతితో స్నేహంగా ఉంటున్నాడు. ఆ క్రమంలో నిన్ను ప్రేమిస్తున్నాను... పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. ఆ మాటలను ఆ యువతి నమ్మింది. దీంతో అక్టోబర్ 5వ తేదీన రమేష్ స్నేహితుడు పరశురాం.. సదరు యువతి ఇంటికి వచ్చి.. మీ పెళ్లి విషయంపై రమేష్ మాట్లాడదలచుకున్నాడని, వెంటనే తనతో వెంటరావాలని ఒత్తిడి చేశాడు.
దీంతో పరశురాం మాటలు నిజమని భావించి యువతి అతడి పాటు వెళ్లింది. ఆమెను నిర్జన ప్రాంతానికి తీసుకువెళ్లాడు. అప్పటికే అక్కడ వేచి ఉన్న రమేష్.. అతడి స్నేహితుడు ఆమెపై అత్యాచారం చేశారు. ఆ సన్నివేశాలను మొబైల్లో చిత్రీకరించారు. ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే ... వాట్సాప్ ద్వారా ఇతరుల మొబైల్కు పంపుతామని బెదిరించారు. దీంతో బాధితురాలు మిన్నకుండి పోయినట్లు పోలీసులకు చెప్పింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు అందులో భాగంగా నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more