మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య ఇంట్లో ఈరోజు ఉదయం జరిగిన అగ్నిప్రమాదంపై ఇప్పటికే పలు అనుమానాలు వ్యక్తమవుతుండగా.. తాజాగా మరో ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. పిల్లలతో సహా తనను పట్టించుకోని మామ రాజయ్యకు వరంగల్ లోక్ సభ టికెట్ ఇవ్వొద్దంటూ సారిక ఏఐసీసీకి మూడురోజుల క్రితమే లేఖ రాసిందట. ఆ లేఖలో తన మామకు వ్యతిరేకంగా కొన్ని అభిప్రాయాలను సైతం వెల్లడించిందని తెలుస్తోంది.
అయితే.. సారిక రాసిన ఆ లేఖ ఏఐసీసీ పెద్దలకు చేరిందో లేదో.. ఒకవేళ చేరినా దానిని పట్టించుకోకుండా పక్కనపెట్టేశారమో పక్కాగా తెలియదు కానీ.. రాజయ్యకే టికెట్ ఇస్తూ కాంగ్రెస్ పార్టీ ప్రకటన చేసింది. ఈ నేపథ్యంలోనే రెండురోజుల క్రితమే వరంగల్ లోని తన ఇంటికి మకాం మార్చిన రాజయ్య.. ఆ సందర్భంగా తన కోడలు సారికతో గొడవ పడ్డారట. బహుశా ఆమె రాసిన లెటర్ విషయమై ఆయన గొడవ పడ్డారేమోనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తనకు వ్యతిరేకంగా ఆ లెటర్ రాసినందుకు ఆగ్రహించిన ఆయన.. ఇంటికొచ్చిన వెంటనే తన కోడలు సారికతో గొడవకు దిగారట.
గతంలోనూ చాలాసార్లు ఆయన సారికతో గొడవ పడినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆ క్రమంలోనే ఈమె తనను, తన పిల్లలను భర్త, అత్తమామలు ఏమాత్రం పట్టించుకోవడం లేదని సారిక కొన్ని నెలల క్రితం సెక్షన్ 498 కింద పోలీసులకు ఫిర్యాదు చేసింది కూడా. ఆ వివాదం అప్పట్లో కాస్త సద్దుమణిగింది కానీ.. అనంతరం మళ్లీ గొడవలు ప్రారంభమయ్యాయట. ఇలాంటి సమయంలోనే ఇంట్లో ప్రమాదం చేసుకోవడం, ముగ్గురు పిల్లలతో సహా సారిక మంటలకు ఆహుతి కావడంపై రకరకాల అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ కేసులో మరెన్ని ట్విస్టులు వెలుగు చూస్తాయో!
AS
(And get your daily news straight to your inbox)
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more
Oct 07 | గుజరాత్ పోలీసులు స్థానిక యువతపై కాకీ కాఠిన్యాన్ని ప్రదర్శించారు. ఓ వర్గానికి చెందిన యువతపై ఇలా విరుచుకుపడటం ఇప్పుడు రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. సబ్ కా సాత్, సబ్ కా వికాస్ అంటూ కేంద్ర,... Read more