పోకిరి సినిమాలొ బ్రహ్మానందం ఎపిసోడ్ ను ఎవరు మాత్రం మరిచిపోతారు. బిక్షగాళ్ల బ్యాచ్ బ్రహ్మానందంను వేదించే తీరు.. అందరికి నవ్వు తెప్పించింది. ఎక్కడికి వెళ్లినా... ఏం చేస్తున్నా కానీ బాబు దానం... దానం అంటూ వేధిస్తే.. దానికి బ్రహ్మానందం పడే వేధన అంతా ఇంతా కాదు. చివరకు పోలీసులకు ఫోన్ చేసినా కానీ ఇష్టంవస్తే. దానం చెయ్యండి లేదంటే మానెయ్యండి అంటేూ చెబుతారు. దాంతో ఏం చెయ్యాలో అర్థంకాక కాంప్రమైజ్ కు వస్తారు బ్రహ్మానందం. అయితే తాగా ఈ సీన్ ను ఓ మంత్రి గారికి చూపించాలేమో. ఎందుకంటే బిక్షం అడిగిన ఓ చిన్నారిని కాలితో తన్నడమే కాకుండా.. తన సెక్యూరిటీతో కొట్టించింది. అసలు అక్కడ ఏం జరిగిందో... తెలుసుకోవాలంటే మొత్తం స్టోరీ చదవాల్సిందే.
మధ్యప్రదేశ్ ప్రభుత్వంలోని పశు సంవర్థకశాఖ మంత్రి కుసుమ్ మెహడేలే మానవత్వాన్ని మరిచారు. డబ్బులు అడిగాడనే కారణంతో ఓ అడుక్కునే పిల్లాడిని కాలితో తన్ని మహిళా మంత్రి తన నైజాన్ని బయటపెట్టుకున్నారు. భోపాల్కు సమీపంలోని పన్నాలో జరిగిన ఈ ఘటన కెమెరాకు చిక్కింది. వివరాల్లోకి వెళితే.. స్వచ్ఛభారత్ కార్యక్రమంలో భాగంగా స్థానిక బస్టాండ్లో చెత్త ఊడ్చే కార్యక్రమానికి ఆమె హాజరయ్యారు.ఈ కార్యక్రమం ముగించుకొని వెళుతుండగా దానం చేయాలని బాలుడు అభ్యర్థించారు. దాంతో అసహనానికి గురైన మంత్రి బాలుడిని కాలితో తన్నారు. అంతటితో ఆగకుండా పసివాడిపై అంగరక్షులు చేయిచేసుకున్నారు. మంత్రి తీరుపై పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమవుతున్నది. మంత్రివర్గం నుంచి కుసుమ్ మెహడేలేను తొలగించాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. ఇలా వివాదంలో కూరుకుపోవడం ఆ మంత్రికి మొదటిసారి కాదు.. ఇటీవల సింహాలను, పులులను ప్రజలు పెంచుకొనే విధంగా చట్టాన్ని రూపొందించాలని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more