ఓ మహిళ కోసం ఇద్దరూ మగాళ్లు కొట్టుకున్న ఘటనలు విశ్వవ్యాప్తంగా కోకొల్లలు. ఆనాడు ‘రామాయణం’, ‘మహాభారతం’ లాంటి జరిగిన మహాసంగ్రామాలు కూడా ‘స్త్రీ’ల కారణంగానే అని చెప్పుకోవడంలో అతిశయోక్తి లేదు. ఇక నేటి ఆధునిక యుగంలో కుటుంబసభ్యులే ఓ అమ్మాయి కోసం దారుణంగా హతమార్చుకుంటున్న ఘటనలు లెక్కలేనన్ని జరుగుతున్నాయి. అయితే.. ఈ దారుణాల్ని అరికట్టాల్సిన పోలీసులే ఇందుకు పాల్పడుతున్నారంటే సమాజం ఎంత పెడదారి పట్టిందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. ఇందుకు నిదర్శనంగా తాజాగా ఓ ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ లేడీ కానిస్టేబుల్ కోసం గొడవపడిన ఇద్దరు కానిస్టేబుల్స్ లో తన జూనియర్ ని బాంబ్ పెట్టి చంపేశాడు హెడ్. మహారాష్ట్రలోని రాయగఢ్ జిల్లాలో జరిగిన ఈ ఉదంతం తీవ్ర కలకలం సృష్టిస్తోంది.
నితేష్ పాటిల్ (28) అనే కానిస్టేబుల్ శివర్ధన్ పోలీసు స్టేషన్లో విధులు నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలోనే ఇతనికి ఓ మహిళా కానిస్టేబుల్ లో పరిచయం ఏర్పడగా.. అది వివాహేతర సంబంధానికి దారితీసింది. గుట్టుచప్పుడు కాకుండా వారిరువురు తమ అక్రమబంధాన్ని కొనసాగిస్తూ వచ్చారు. నితేష్కు అప్పటికే పెళ్లయింది, రెండున్నర నెలల పాప కూడా వున్నప్పటికీ.. తన కామవాంఛను తీర్చుకోవడం కోసం సదరు మహిళా కానిస్టేబుల్ తో రహస్యంగా అక్రమసంబంధం నడుపుతూ వచ్చాడు. అయితే.. ఈ విషయం అదే స్టేషన్ లో పనిచేస్తున్న ప్రహ్లాద్ పాటిల్ (45) అనే హెడ్ కానిస్టేబుల్ తెలిసింది. దీంతో కోపంతో రగిలిపోయిన ప్రహ్లాద్.. ఆమెకు దూరంగా వుండాలంటూ నితేష్ ను చాలాసార్లు హెచ్చరించాడు. అటు ఆమెను సైతం అతనితో దూరంగా వుండాలని ప్రహ్లాద్ సూచించాడు. లేకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పినట్లు తెలిసింది. అయినప్పటికీ వారు అతని మాటలు పట్టించుకోకుండా తమ బంధాన్ని కంటిన్యూ చేస్తూ వచ్చారు. ఈ నేపథ్యంలోనే ప్రహ్లాద్ చాలాసార్లు నితేష్ తో గొడవలకు దిగాడు. అప్పటివరకు మాటలతోనే దూషించుకున్న వారిద్దరూ కొట్టేకునేదాకా వ్యవహారం వెళ్లింది.
ఇక లాభం లేదని భావించిన ప్రహ్లాద్.. నితేష్ ని చంపేయాలని పథకం రచించాడు. అతగాడి బైకులో ఎవరికీ తెలియకుండా బాంబు అమర్చాడు. నితేష్ తన బైకు స్టార్ట్ చేసేందుకు కిక్ కొట్టగానే బాంబు పేలి అతడు తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే అతనికి ఎంజీఎం ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మరణించాడు. అతని మరణానికి గల కారణాలేంటి? అని విచారించగా... ఈ కుట్రకు కారణం వివాహేతర సంబంధం వల్ల ఏర్పడిన వ్యక్తిగత ద్వేషమేనని పోలీసులు భావిస్తున్నారు. ఆ లేడీ కానిస్టేబుల్ కారణంగా వారిరువురు గతంలో గొడవ పడిన సందర్భాలూ చాలా వున్నాయి కాబట్టి.. నితేష్ ని చంపింది హెడ్ ఫ్రహ్లాదేనని వారు అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే నిందితుడిని అరెస్టు చేసి విచారణ జరుపుతున్నామని రాయగఢ్ ఎస్పీ మహ్మద్ సువేజ్ హక్ తెలిపారు.
AS
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more