విపక్ష పార్టీలపై ముఖ్యంగా అధికార టీడీపీ మీద విమర్శలు గుప్పించడంలో తనకు తానే సాటి అని రోజా ఎన్నోసార్లు నిరూపించుకుంది. టీపీడీ నుంచి ఎవరైనా ఘాటు వ్యాఖ్యలు చేసినా, ఏదైనా ఘటన చోటు చేసుకున్నా చాలు.. అవకాశం దొరికిందని వెంటనే మైకు చేత పట్టుకుని మాటల యుద్ధానికి రంగంలోకి దిగుతుంది. అలాంటి అవకాశమే ఇప్పుడు మళ్లీ రావడంతో తాజాగా ఈమె మరోసారి టీడీపీ మీద నిప్పులు చెరిగింది.
ఇటీవల టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కుటుంబ ఆస్తులు ప్రకటించిన విషయం తెలిసిందే! ఆ సందర్భంలో ఆయన మాట్లాడుతూ.. తాము పాలు, కూరగాయలు అమ్ముకుని జీవిస్తున్నామని, జీవితం ఇలానే చాలా బాగుందన్నారు. ఆ మాటలపై తాజాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే రోజా ఎద్దేవా చేసింది. తిరుమలలో విలేకరుల సమావేశంలో మాట్లాడిన రోజా.. పాలు, కూరగాయలతో కోట్లు సంపాదించే కిటుకేంటో సీఎం చంద్రబాబు చెప్పాలని డిమాండ్ చేశారు. మరి.. హెరిటేజ్ కు పాలు అమ్మిన రైతులు ఎందుకు ఇంతవరకు కోటీశ్వరులు కావడం లేదని ఆమె సూటిగా ప్రశ్నించింది. వారివంతా తప్పుడు లెక్కలని, కోట్లాది రూపాయల డబ్బుల్ని లోపల దాచి పెట్టుకుని, కేవలం కొద్ది మొత్తాన్నే ఆస్తుల రూపంలో చూపుతున్నారని ఆమె పేర్కొంది. ఈ నేపథ్యంలో కళాశాల విద్యార్థుల ఆత్మహత్య ఘటనల్ని తెరమీదకి తీసుకొచ్చింది.
నారాయణ కళాశాల విద్యార్థుల ఆత్మహత్యలపై ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడంలేదని రోజా తెలిపింది. ఇంతవరకు 14 మంది నారాయణ విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారని, కానీ మంత్రి నారాయణను ఎందుకు అరెస్ట్ చేయడం లేదని సూటిగా ప్రశ్నించింది. విద్యార్థుల ఆత్మహత్యలకు బాధ్యులైన యాజమాన్యాలపై కేసు పెడతామని మంత్రి గంటా చెప్పారని, ఇప్పుడెందుకు మౌనంగా ఉన్నారని ఆయన్ను నిలదీసింది. ఒకవేళ నారాయణ కళాశాలల కోసం ప్రభుత్వం ప్రత్యేక జీవో ఏమైనా ఇచ్చిందా అని అడిగింది. మరి.. ఈమె చేసిన వ్యాఖ్యలపై టీడీపీ ఎలా స్పందిస్తుందో వేచి చూడాల్సిందే!
AS
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more