దేశ ఆర్థిక రాజధానిగా వెలుగొందుతున్న ముంబై మహానగరంలో 7/11 వరుస బాంబు పేలుళ్ల కేసులో మోకా ప్రత్యేక కోర్టు ఇవాళ కీలక తీర్పును వెలువరించింది. ఈ కేసులో ఐదుగురు దోషులకు మరణ శిక్ష విధిస్తూ తీర్పును వెలువరించింది. దోసులుగా తేలిన మరో ఏడుగురికి జీవితఖైదు విధిస్తూ బుధవారం తీర్పునిచ్చింది. 13 మంది నిందితుల్లో 12 మందిని కోర్టు ఈ నెల 11న దోషులుగా తేల్చింది. తొమ్మిదేళ్ల సుదీర్ఘ విచారణాంతరం ఈ కేసులో తుది తీర్పు వెలువడింది. న్యాయమూర్తి జస్టిస్ యతిన్ షిండే తీర్పును వెలువరిస్తూ.. ఈ పేలుళ్లు జరిగేందుకు వివిధ ప్రాంతాలలో బాంబులను అమర్చిన ఫైసల్ షేఖ్, అసిఫ్ ఖాన్, కమల్ అన్సారీ, ఏహ్తీషమ్ సిద్దిఖీ, నవీద్ ఖాన్ లకు మరణశిక్ష విధించారు.
ఈ బాంబు పేలుళ్లు సహకరించిన ఏడుగురికి జీవిత ఖైదు శిక్షను విధించింది. బాంబులు పేల్చేందుకు ఎటక్ట్రికల్ సర్క్యూట్స్ ను అమర్చిన మహ్మమద్ సాజిద్ అన్సారీ, తన గొవండి నివాసాన్ని బాంబుల తయారీకి వినియోగించేందుకు అనుమతించిన మహ్మమద్ అలి, ఇక బాంబు పేలుళ్ల కుట్రకు పన్నాగం పన్నిన డాక్టర్ తన్వీర్ అన్సారీ, మాజీద్ షఫీ, ముజామ్మిల్ షేక్, సోహెల్ షేక్, జమీర్ షేక్ లకు న్యాయస్థానం యావజ్జీవ శిక్షను విధిస్తూ తీర్పును వెలువరించింది. కోర్టు తుది తీర్పు వెలువడిన నేపథ్యంలో ముంబై సహా దేశంలోని ప్రధాన నగరాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. కాగా, మోకా కోర్టు తీర్పును హైకోర్టులో సవాల్ చేస్తామని దోషుల తరపు న్యాయవాదులు ప్రకటించారు.
2006 జులై 11న ముంబై మహా నగరంలోని సబర్బన్ రైళ్లను లక్ష్యంగా చేసుకొని ఉగ్రవాదులు 11 చోట్ల వరుస బాంబు పేలుళ్లకు పాల్పడ్డారు. ఖార్ రోడ్, బాంద్రా, మాతుంగా, మాహిమ్ జంక్షన్, జోగేశ్వరి, మీరా రోడ్, భయాందర్, బోరీవాలిల్లో 11 నిమిషాల తేడాలో వరుస పేలుళ్లు జరిగాయి. ఈ దాడుల్లో 189 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 800 మందికి పైగా గాయపడ్డారు. కాలక్రమంలో మరో ఐదుగురు మరణించారు. అప్పటి నుంచి ఈ కేసులో నిందితులపై విచారణ సాగించిన మోకా న్యాయస్థానం ఇవాళ కీలక తీర్పును వెలువరించింది. కాగా, ఈ దారుణ మారణకాండ నుంచి వెనువెంటనే కొలుకున్న ముంబయి మహానగరం.. తాము ఇలాంటి ఉగ్రవాద ఘటనలకు బెదరమని చాటిచెబుతూ.. మరుసటి రోజునే యధావిధిగా కార్యకలాపాలను సాగించిన తీరును అప్పట్లో దేశవిదేశాధినేతలు ప్రశంసించారు.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more