సినీ పరిశ్రమలో వున్న కొందరు ప్రముఖులు రాజకీయాలవైపు దృష్టి సారిస్తున్న విషయం తెలిసిందే! బాలీవుడ్ సహా దక్షిణాది పరిశ్రమలోనూ ఇప్పటికే ఎంతోమంది రాజకీయాల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఇప్పుడు నటి రాశీ కూడా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతోందనే పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అందుకు కారణం ఈమె వైకాపా అధినేత జగన్ ని కలుసుకోవడమే! దీంతో ఈమె త్వరలోనే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి చేరనుందని, ఈమె చేరికతో రోజాకి కష్టాలు మొదలవుతాయని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
తమ కూతురు బర్త్ డే సందర్భంగా శనివారం నటి రాశీ తన కుటుంబంతో లోటప్పాండ్కు వచ్చి జగన్ని కలిసింది. కేవలం తమ కూతురి బ్లెస్సింగ్స్ కోసమే జగన్ ని కలిసినట్లు రాశీ ఫ్యామిలీ చెప్పినట్లుగా బయట ప్రచారం కొనసాగుతోంది. ఒకవేళ ఇదే నిజమైతే.. ఎటువంటి హంగు ఆర్భాటాలు లేకుండా సీక్రెట్ గా కలవాల్సిన అవసరం ఏముంది? పైగా.. జగన్ ఇంటికి వెళ్లకుండా, అతని పార్టీ ఆఫీసులో రాశీ దంపతులు సమావేశం కావడం ఏంటి? అనే ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలోనే మరిన్ని అనుమానాలు తెరమీదకి వచ్చాయి. రాశీ వైసీపీలో చేరాలని భావిస్తోందని, అందుకే జగన్ తో చాలా సీక్రెట్ గా కలిసిందని చెప్పుకుంటున్నారు. ఇంకా రకరకాల గాసిప్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. మొత్తం.. రాశీ వైసీపీలో చేరుతుందనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి.
ఒకవేళ రాశీ నిజంగానే వైసీపీలో చేరితే.. రోజా స్పీడ్ కచ్చితంగా తగ్గుతుందని అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. నిజానికి రోజా వైసీపీలో కీలకపాత్ర పోషిస్తుంది. ఇదివరకే టీడీపీలో కొన్నాళ్లు బాధ్యతలు నిర్వహించిన ఈమె.. ఆ ఆనుభవంతో ఆ పార్టీ బలం, బలహీనత అవగాహన ఈమెలో వుంది. ఆ అనుభవంతోనే ఆ పార్టీపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తోంది. వీలు చిక్కినప్పుడల్లా ఆ పార్టీపై అగ్గిమీద గుగ్గిలమైపోతుంటుంది. ఇలాంటి సమయంలో రాశీ ఎంట్రీ ఇస్తే.. ఆమె ఇమేజ్ కాస్త తగ్గే అవకాశాలు వున్నాయి. పైగా.. కొత్తగా వచ్చిన వారికి ప్రాధాన్యత ఎక్కువ వుంటుంది కాబట్టి.. రోజా మీద వైసీపీ దృష్టి తగ్గుతుంది. దీంతో ఇప్పుడు రోజా కూడా ఆందోళనల్లో మునిగినట్లు ప్రచారం కొనసాగుతోంది. జగన్ తో రాశీ కలవడం వెనుక ఆంతర్యం ఏమిటన్న ఆలోచనల్లో ఆమె మునిగిందట!
ఇంతకీ రాశీ రాజకీయాల్లో ఎంట్రీ ఇస్తుందో లేదో, వైకాపా తీర్థం పుచ్చుకుంటుందో లేదో తెలీదు కానీ.. జగన్ తో ఆమె జరిగిన భేటీ మాత్రం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చలకు దారితీసింది. ఇంకా ముందుముందు వారి భేటీపై మరిన్ని పుకార్లు వచ్చే అవకాశాలు లేకపోలేదు. వీటన్నింటికి ఫుల్ స్టాప్ పడాలంటే.. రాశీ నోరు విప్పక తప్పదు. మరి.. ఈ గాసిప్పులపై ఆమె ఎలా స్పందిస్తుందో వేచి చూడాల్సిందే!
AS
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more