భారతీయ సభ్య సమాజంలో అమ్మాయిగా పుట్టడం పెద్ద తప్పా..? ప్రస్తుత కాలంలో తమకు ఎదురవుతున్న పరిస్థితుల నేపథ్యంలో ప్రతీ ఆడపిల్ల తనకు తాను వేసుకుంటున్న ప్రశ్న. ఆడపిల్లగా పట్టడం అంటే.. అంగట్లో బొమ్మేనా..? తండ్రి, సోదరుడు, గురువు, పక్కింటివాడు, పోరుగింటివాడు, అపరిచితుడు, పరిచితుడు, ఇలా ఎవడు పడితే వాడు.. తాను వయస్సుకు వస్తున్న తరుణంలో తమను కామవాంఛతో చూస్తారా..? ఒక్క అమ్మ.. (అమె అడది కనుక) తప్ప సభ్య సమాజంలో తమను అండగా, రక్షణగా నిలచే వారే లేరా..? యత్ర నార్యంతు పూజ్యంతే తత్ర రమ్యతే దేవతా: అన్న భారతీయ సంస్కృతీ సంప్రదాయాలు ఏమయ్యాయి.? అవి నాటి తరం పురుషసమాజంతోనే సమాధి కట్టబడ్డాయా..? ఇవి ఏ అడపిల్లను కదిలించినా వినబడుతున్న ప్రశ్నలు. వీటికి సమాధానం చెప్పేదెవరు..?
మాతృదేవోభవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ అన్నట్లుగానే విద్యార్ధినులు తల్లిదండ్రుల తరువాత అత్యంత ప్రేమగా మెలిగేది గురువులతోనే. అలాంటి గురువు స్థానంలో కొనసాగుతూ బాలికలపై వికృత చేష్టలకు దిగాడు ఓ నీచుడు. భావిభారత పౌరులుగా తీర్చిదిద్దాల్సిన గురుతర బాధ్యతను మరచి లైంగికవేధింపులకు యత్నించాడు. తమకు జరుగుతున్న అవమానాన్ని తల్లిదండ్రులకు చెప్పి.. వారిని వెంటబెట్టుకుని వారండంతో పాఠశాల వద్ద ఆందోళన చెలరేరింది. పదో తరగతి పిల్లలతో ఎలా వ్యవహరించాలో కూడా తెలియకుండానే ఉపాధ్యాయ వృత్తిలోకి కీచకులు, నీచులు రావడంతోనే ఈ పరిస్థితులు ఉత్పన్నమవుతున్నాయి.
బాధిత విద్యార్థినుల కథనం ప్రకారం.. కురవి శివారులోని ఏకలవ్య బాలికల గురుకుల పాఠశాల ఉపాధ్యాయుడు వికాస్ పాఠాలు చెప్పే క్రమంలో పదోతరగతి బాలికల తొడలు గిల్లడం, తలపై చాక్పీస్తో కొట్టడం, హేళనగా మాట్లాడడం లాంటి చేష్టలకు దిగుతున్నాడు. ఈ మేరకు వారు తమ తల్లిదండ్రులకు తెలియజేశారు. వారు పాఠశాలకు చేరి ఆందోళనకు దిగారు. ఫిజిక్స్కు బదులు బయోలాజికల్ సైన్స్ పాఠాలు చెబుతున్నాడని పేర్కొన్నారు. ఈ విషయాన్ని మేట్రిన్ శోభారాణి దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదని ఆవేదన వెలిబుచ్చారు.
ప్రిన్సిపాల్కు చెప్పినా ప్రయోజనం లేకుండాపోయిందన్నారు. ఈ విషయాన్ని విలేకరులకు వివరిస్తుండగా ప్రిన్సిపాల్ రమేష్రెడ్డి ప్రధాన ద్వారం వద్దకు వచ్చి బాలికలు చెప్పే విషయాన్ని వినకుండా నిర్లక్ష్యంగా మాట్లాడారు. దీంతో బాలికలు, తల్లితండ్రులు ఆయనతో వాదనకు దిగారు. సమాచారం అందుకున్నపోలీసులు గురుకులానికి చేరుకుని పరిస్థితి సమీక్షించారు. వికాస్తోపాటు మేట్రిన్పై ఫిర్యాదు చేస్తామని తల్లిదండ్రులు తెలిపారు. ఈవిషయమై ప్రిన్సిపాల్ రమేష్రెడ్డి మాట్లాడుతూ.. బాలికల ఫిర్యా దు మేరకు విచారణ చేసి చర్యలు తీసుకుంటామన్నారు.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more